Tamil Nadu State Film Awards | తమిళనాడు ప్రభుత్వం 2016 నుండి 2022 మధ్య విడుదలైన సినిమాలకు సంబంధించిన స్టేట్ ఫిల్మ్ అవార్డ్స్ను అధికారికంగా ప్రకటించింది. ఇవి తమిళ సినిమా పరిశ్రమలో ప్రతిభను గుర్తించి, హీరోలు, నటీనటులు, దర్శకులు, సాంకేతిక నిపుణులను సత్కరించే ఉద్దేశంతో నిర్వహించబడుతున్నాయి. సినిమాలతో పాటు టెలివిజన్ రంగంలో ప్రతిభ ప్రదర్శించిన కళాకారులకు స్టేట్ టీవీ అవార్డ్స్ను కూడా ప్రకటించారు. అవార్డుల ప్రదానోత్సవం ఫిబ్రవరి 13న సాయంత్రం 4:30 గంటలకు చెన్నైలోని కళైవాణర్ అరంగంలో జరుగుతుంది. ఈ వేడుకలో ఉప ముఖ్యమంత్రి విజేతలకు అవార్డులు అందజేయనున్నారు.
ఈ అవార్డుల జాబితాలో ధనుష్, విజయ్ సేతుపతి, సూర్య, కార్తి, ఆర్య, విక్రమ్ ప్రభు, ఆర్. పార్థిబన్ వంటి ప్రముఖులే ఉత్తమ నటులుగా ఎంపికయ్యారు. ఉత్తమ నటీమణులుగా నయనతార, కీర్తి సురేశ్, జ్యోతిక, అపర్ణా బాలమురళి, లిజోమోల్ జోస్, సాయి పల్లవి అవార్డులు అందుకుంటున్నారు. ఈ అవార్డుల్లో సూర్య హీరోగా నటించిన ‘జై భీమ్’ సినిమా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 2021లో విడుదలైన ఈ చిత్రం ఏకంగా ఏడు విభాగాల్లో అవార్డులు గెలుచుకొని సంచలనాన్ని సృష్టించింది. ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటి, విలన్, సహాయ నటుడు, సంగీత దర్శకుడు, నేపథ్య గాయకుడు విభాగాల్లో ఈ సినిమాకు పురస్కారాలు దక్కాయి. ఈ ఘన విజయం ‘జై భీమ్’ని అవార్డుల లోకంలో హైలైట్గా నిలిపింది.
సంవత్సరం వారీగా ముఖ్య అవార్డులు:
2016
ఉత్తమ చిత్రం: మానగరం
ఉత్తమ నటుడు: విజయ్ సేతుపతి
ఉత్తమ నటి: కీర్తి సురేశ్
2017
ఉత్తమ చిత్రం: ఆరం
ఉత్తమ నటుడు: కార్తి
ఉత్తమ నటి: నయనతార
2018
ఉత్తమ చిత్రం: పరియేరుమ్ పెరుమాల్
ఉత్తమ నటుడు: ధనుష్
ఉత్తమ నటి: జ్యోతిక
2019
ఉత్తమ చిత్రం: అసురన్
ఉత్తమ నటుడు: ఆర్. పార్థిబన్
ఉత్తమ నటి: మంజు వారియర్
2020
ఉత్తమ చిత్రం: కూజంగల్
ఉత్తమ నటుడు: సూర్య
ఉత్తమ నటి: అపర్ణా బాలమురళి
2021
ఉత్తమ చిత్రం: జై భీమ్
ఉత్తమ నటుడు: ఆర్య
ఉత్తమ నటి: లిజోమోల్ జోస్
2022
ఉత్తమ చిత్రం: గార్గి
ఉత్తమ నటుడు: విక్రమ్ ప్రభు
ఉత్తమ నటి: సాయి పల్లవి
తమిళ సినిమా పరిశ్రమలోని ప్రతిభను గౌరవిస్తూ ప్రకటించిన ఈ స్టేట్ అవార్డులు నటీనటులు, దర్శకులు, చిత్రబృందాలకు మరింత ఉత్సాహాన్ని నింపాయి. ముఖ్యంగా ‘జై భీమ్’ సినిమా సాధించిన ఘన విజయం, ఏడు విభాగాల్లో అవార్డులు గెలుచుకోవడం ఈ ఉత్సవంలో ప్రధాన హైలైట్గా నిలిచింది.
