Health Tips | రోజూ పళ్లు తోమకుండానే నీళ్లు తాగితే చాలా లాభాలున్నాయి తెలుసా..?

Health Tips | సాధారణంగా చాలా మంది ఉదయం లేవగానే వాష్‌రూమ్‌కు వెళ్లి, బ్రష్‌ చేసుకున్న తర్వాతనే ఏదైనా తాగడం గానీ, తినడంగానీ చేస్తారు. అప్పటి వరకు పచ్చి మంచినీళ్లు కూడా ముట్టరు. నోరును శుద్ధి చేసుకోకుండా ఏదైనా తింటే ఆరోగ్యం దెబ్బతింటుందని భయపడుతుంటారు. కానీ ఆరోగ్య నిపుణులు మాత్రం బ్రష్‌ చేయకముందే మంచినీళ్లు తాగితే ఆరోగ్యానికి చాలా మంచిదని అంటున్నారు.

  • By: Thyagi |    health |    Published on : May 12, 2024 8:44 AM IST
Health Tips | రోజూ పళ్లు తోమకుండానే నీళ్లు తాగితే చాలా లాభాలున్నాయి తెలుసా..?

Health Tips : సాధారణంగా చాలా మంది ఉదయం లేవగానే వాష్‌రూమ్‌కు వెళ్లి, బ్రష్‌ చేసుకున్న తర్వాతనే ఏదైనా తాగడం గానీ, తినడంగానీ చేస్తారు. అప్పటి వరకు పచ్చి మంచినీళ్లు కూడా ముట్టరు. నోరును శుద్ధి చేసుకోకుండా ఏదైనా తింటే ఆరోగ్యం దెబ్బతింటుందని భయపడుతుంటారు. కానీ ఆరోగ్య నిపుణులు మాత్రం బ్రష్‌ చేయకముందే మంచినీళ్లు తాగితే ఆరోగ్యానికి చాలా మంచిదని అంటున్నారు. రోజూ పళ్లు తోమకుండానే ఒక గ్లాసు నీల్లు తాగితే ఆరోగ్యపరంగా చాలా లాభాలు ఉన్నాయని చెబుతున్నారు. ఆ లాభాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఏమిటా లాభాలు..?

  • ఉదయం లేవగానే బ్రష్‌ కూడా చేయకుండా నీళ్లు తాగడం వల్ల కలిగే ముఖ్య ప్రయోజనం బరువు తగ్గడం. కాబట్టి ఊబకాయం ఉన్న రోజూ లేవగానే పళ్లు తోమకముందే ఒక గ్లాస్‌ నీళ్లు తాగడం అలవాటు చేసుకోవాలి.
  • రోజు పళ్లు తోమకముందే నీళ్లు తాగడంవల్ల శరీరంలో జీవక్రియ రేటు పెరుగుతుంది. ఇది శరీరంలోని కేలరీలను బర్న్ చేయడంలో సాయపడుతుంది. అందుకే ఒంట్లో కొవ్వు పేరుకోకుండా ఉంటుంది.
  • బ్రష్‌ కూడా చేయకముందే నీళ్లు తాగడం వల్ల ఆకలి అదుపులో ఉంటుంది. పళ్లు తోమగానే ఏదో ఒకటి తీసుకోవాలనేంత ఆకలి ఉండదు. దాంతో తక్కువగా తింటారు. ఇది కూడా ఊబకాయం బారిన పడకుండా చూస్తుంది.
  • ఈ రోజుల్లో చాలా మంది హై బీపీ, మధుమేహం లాంటి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. నిద్ర లేవగానే ఒక గ్లాసు గోరువెచ్చని నీటిని తాగడంవల్ల సమస్యలు కూడా నియంత్రణలో ఉంటాయి.
  • అంతేగాక బ్రష్‌ కూడా చేయకముందే నీల్లు తాగడం వల్ల జీర్ణవ్యవస్థ బలపడుతుంది. దాంతో ఎసిడిటీ, మలబద్ధకం, గ్యాస్‌ సమస్యలు తొలగిపోతాయి. ఉదర సంబంధ ఇబ్బందులు సమసిపోతాయి.
  • రోజూ పళ్లు తోమకముందే నీళ్లు తాగడం వల్ల రోగనిరోధక శక్తి కూడా మెరుగుపడుతుంది. మాటిమాటికి జలుబు, దగ్గు లాంటి సమస్యలు రాకుండా ఉంటాయి. వచ్చినా త్వరగా తగ్గిపోతాయి.
  • పళ్లు తోమకుండా నీళ్లు తాగడం వల్ల నోటి దుర్వాసన సమస్య కూడా తగ్గుతుంది. నోటిలో ఉండే బ్యాక్టీరియా నశిస్తుంది. దాంతో ఆరోగ్యం మెరుపడి అలసట తొలగిపోతుంది.