హైదరాబాద్ గచ్చిబౌలిలోని అంజయ్యనగర్లో నిర్మాణంలో ఉన్న ఓ బహుళ అంతస్థుల భవనం కూలిపోయింది. ఈ ఘటనలో భవన శిధిలాల కింద చిక్కుకుని ఇద్దరు మృతి చెందారు. మృతదేహాన్ని హైడ్రా సిబ్బంది శిధిలాల నుంచి బయటకు తీశారు. ఏడంతస్తులతో నిర్మిస్తున్న ఈ భవనం కూలడంతో దాని శిథిలాలు పక్కనున్న అపార్ట్మెంట్పై పడ్డాయి. దీంతో పక్కనే హాస్టల్లో ఉన్న వ్యక్తులు భయంతో పరుగులు తీశారు.
నాలాను ఆనుకొని 50 గజాల స్థలంలో ఈ భవనాన్ని నిర్మిస్తున్నారు. హాస్టల్ కోసం ఈ భవనం నిర్మిస్తున్నట్లుగా సమాచారం. కుప్పకూలిన భవన శిధిలాల కింద ఇంకా ఎవరైనా ఉన్నారో లేదోనని రెస్క్యూ బృందాలు ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి.
గచ్చిబౌలిలో ఘోర ప్రమాదం
గచ్చిబౌలి అంజయ్య నగర్లో ఒక్కసారిగా కుప్పకూలిన ఏడు అంతస్తుల భవనం
నాలాను అనుకుని 50 గజాల స్థలంలో అక్రమంగా నిర్మిస్తున్న ఏడు అంతస్తుల భవనం
యజమాని, బిల్డర్ల అత్యాశకు పక్కనే ఉన్న నిర్మాణాలు సైతం పాక్షికంగా కూలిపోయాయి
భవనంలో ఎంతమంది ఉన్నారు అని… pic.twitter.com/Xot9lcdaVT
— Telugu Feed (@Telugufeedsite) August 22, 2026
