విధాత:మెదక్ ప్రత్యేక ప్రతినిధి: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని కాంగ్రెస్ నేత మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. బుధవారం మెదక్ నియోజక వర్గంలోని ఏడుపాయల వన దుర్గామాత,ఆలయంలో కుమారుడు రోహిత్తో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మెదక్ చర్చిలో, పిట్లం బెస్ వద్ద దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన తరువాత మొదటిసారి నియోజకవర్గానికి మైనంపల్లి హన్మంతరావు,రోహిత్లు రావడంతో పార్టీ నేతలు కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు.
ఈ సందర్భంగా చర్చ ప్రధాన గేటు బయట ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు మీడియాతో మాట్లాడారు. పారాసూట్లో దిగామని కామెంట్ చేస్తున్నారు ఎవరు పారషూ టులో దిగారో గుండె మీద చేయి వేసుకుని ఆత్మ పరిశీల చేసుకోవాలన్నారు.. ఎవరైతే కామెంట్ చేశారో వారి సొంతూరు అదేనా అని ప్రశ్నించారు. జిల్లా నాది,నేను లోకల్ అని బల్లగుద్ది చెప్తావున్నా ఎన్ని సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా మెదక్ జిల్లాలో ఉన్నాను మెదక్, రామాయంపేట, ప్రజల ఆశీర్వాదంతో రెండు సార్లు ఎమ్మెల్యేగా చేశా. రోజుకు 450 కిలోమీటర్లు తిరిగిన చరిత్ర నాదని మైనంపల్లి అన్నారు. మెదక్ జిల్లాలో తెలుగుదేశం పార్టీ నుంచి ఏకైక ఎమ్మెల్యేగా, జిల్లా అధ్యక్షుడిగా ఉండి ఎవరికి ఏ కష్టం వచ్చినా కూడా అదుకున్నానన్నారు.
ఆరోగ్య సమస్యల వల్ల హైదరాబాద్ షిఫ్ట్ అయ్యానని, మైనంపల్లి భయపడి పారిపోయే వ్యక్తి కాదన్నారు. నేను హైదరాబాదులో ఉన్నా నలుమూలల నుంచి నా దగ్గరకు వచ్చిన వారిని ఆదుకుంటున్నానని తెలిపారు. కొందరు నాయకులు ఏది పడితే అది మాట్లాడుతున్నారని వారు మాట్లాడే ముందు ఆలోచించుకోవాలని తెలిపారు. డబ్బుల మూటలు తీసుకొని మెదక్ కు వస్తున్నామని చెబుతున్నారని, వారే డబ్బు సంచులతో వస్తున్నారని పరోక్షంగా మంత్రి హరీశ్రావుపై ఆరోపణలు చేశారు.
30 శాతం కమిషన్ ప్రభుత్వం..
30 శాతం కమిషన్ తీసుకొనే బిఆర్ఎస్ నాయకులు పనులు చేస్తున్నారని మైనంపల్లి ధ్వజమెత్తారు. ఆరున్నర లక్షల కోట్ల అప్పులు చేసిన ఘనత ఈ తెలంగాణ ప్రభుత్వాన్ని దక్కిందన్నారు. ఈరోజు మాతో ఎవరు తిరిగినా దళిత బంధు, బీసీ బందు, మైనార్టీ బందు ఇవ్వమని అంటున్నారని అది ఎవరబ్బ సోత్తని ప్రశ్నించారు. ప్రతి మనిషి మీద లక్షన్నర అప్పు చేశారని, అది ఎవరి డబ్బని వారు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. వారి నియోజకవర్గాలను మాత్రమే నిధులు కేటాయించుకుని అమెరికా తరహాలో తయారు చేస్తున్నారు. మిగతా నియోజకవర్గాలు ఏం పాపం చేశాయని మంత్రి హరీష్ ను పరోక్షంగా నిలదీశారు.
మా డబ్బులతో మీ పెత్తనం ఏంటని ప్రశ్నించారు. పార్టీ డబ్బు మీ ప్రభుత్వం డబ్బు కాదని అన్నారు. ఆరు లక్షల కోట్లలో 30% కమిషన్ తీసుకున్నారని చర్చి ముందు ప్రమాణం చేసి చెప్పారు.కొన్ని నియోజకవర్గాలు బ్రహ్మాండంగా డెవలప్ అవుతున్నాయి. మెదక్ ఎం పాపం చేసిందినీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.గతంలో బీఆరెస్లో ఉన్నప్పుడు పర్మిషన్ తీసుకున్న లేకున్నా ర్యాలీలకు, డీజేలకు అడిగే వారు లేరని పార్టీ మారగానే అడ్డంకులు సృష్టిస్తున్రనాని మనం ప్రజాస్వామ్యంలో మేము వేరే ప్రపంచంలో వేరే దేశంలో ఉన్నమా అని మైనంపల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు.
కష్టపడి ప్రజలకు సేవ చేద్దామని రాజకీయాల్లోకి వస్తే పుట్టకతులు లేకుండా డబ్బులతో కొనేస్తా ఉన్నారు.ఇదేమి ప్రజాస్వామ్యామని ప్రశ్నించారు. డబ్బులు ఇస్తే అంత తీసుకోవాలని ఓటు మాత్రం న్యాయపరంగా ఎవరికి వేయాలో వారికెయ్యాలని తెలంగాణ రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. చంద్రబాబు నాయుడుని అరెస్టు చేస్తే రాష్ట్రంలో ధర్నా చేయొదంటారు. కానీ 1000 కార్లు తీసుకొని ఇతర రాష్ట్రాలకు వేరే రాష్ట్రాలకు భారీ ర్యాలీ తీసుకొని వెళ్తా వేరే రాష్ట్రాలకు వెళ్లాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు.
మన రాష్ట్రంలో మాకు పర్మిషన్ కావాలా మీ పార్టీలో ఉంటే పర్మిషన్ అవసరం లేదా ఇదేం న్యాయమని ప్రశ్నించారు. కూడా ఎమ్మెల్యేలు, పీలను కూడా కొనేస్తున్నారని అన్నారు. ఇష్టానుసారంగా ప్రభుత్వ డబ్బులు పంచిపెడతా ఉన్నారు. మనం టాక్స్ కట్టిన డబ్బులను మనకు ఇస్తున్నారని తెలిపారు. హైదరాబాద్ చుట్టుపక్కల లక్ష రూపాయల గజం ఎన్నో ఎకరాలు కొనేశారు. వాళ్లు అభివృద్ధి చెందడానికి హైదరాబాద్ ను అభివృద్ధి చేస్తున్నారని మరి గ్రామాలు ఏం పాపం చేశారన్నారు. ప్రజలందరూ కళ్ళు తెరవకపోతే వేసుకోవడానికి బట్టలు కూడా ఉండమన్నారు.
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య ఉన్న భారతదేశంలో తెలంగాణలో మాత్రం ప్రజాస్వామ్యం లేదన్నారు. ఎవరైనా మాట్లాడితే కేసులు పెడుతూ కేసులకు వాళ్ల పార్టీలో ఉంటే కేసులు ఉండవు. కేసులకు భయపడతామా దొర ఈ భూమి మీద కు వచ్చింది పర్మినెంట్ బతకడానికి కాదు. ఎన్ని సంవత్సరాలు బతికినా డబ్బులు మీరు సంపాదించిన డబ్బులన్నీ ఖర్చు పెట్టిస్తా కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని బల్ల గుద్ది చెప్పారు. కార్యక్రమంలో పిసిసి కార్యదర్శి సుప్రభాత రావు, పాపన్నపెట్ బిఆర్ఎస్ మండల మాజీ అధ్యక్షులు ప్రశాంత్ రెడ్డి, రామాయంపేట మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గంగా నరేందర్,యువ న్యాయవాది జీవన్ రావు, కొండన్ సురేందర్ గౌడ్,బొజ్జ పవన్,పర్శరాంగౌడ్, మాజీ ఎంపీపీ రమేష్ రెడ్డి,తో పాటు నియోజక వర్గంలో నీ అన్ని మండ లాల నుండి పార్టీ నేతలు కార్యకర్తలు తరలివచ్చారు.