లండన్ లో ఘనంగా “టాక్ బోనాల జాతర ” వేడుకలు
– ప్రత్యేక ఆకర్షణగా తొట్టెల ఊరేగింపు, పోతురాజు ఆటలు
లండన్ : తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్) ఆధ్వర్యంలో లండన్లో బోనాల జాతరను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు యుకే నలుమూలల నుండి సుమారు 1000 కి పైగా ప్రవాస కుటుంబ సభ్యులు హాజరయ్యారు.
టాక్ అధ్యక్షుడు రత్నాకర్ కడుదుల ,ఉపాధ్యక్షులు శ్రీమతి శుష్మణ రెడ్డి అధ్యక్షతన ప్రారంభమైన వేడుకలకు, వ్యాఖ్యాతగా ఉపాధ్యక్షులు సత్య మూర్తి చిలుముల వ్యవహరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హౌంస్లౌ నగర డిప్యూటీ మేయర్ ముహమ్మద్ షకీల్ అక్రమ్ హాజరయ్యారు.
స్వదేశం లో జరుపుకున్నట్టుగా సాంప్రదాయ బద్దంగా పూజలు నిర్వహించి, తొట్టెల ఊరేగింపు నిర్వహించారు. ఉత్సవాలల్లో పోతురాజు ఆటలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
లండన్ కి ఉన్నత చదువులకోసం వచ్చిన ప్రవాస తెలంగాణ విద్యార్ధి అక్షయ్ మల్చేలం, వారి వంశ వృత్తిని మర్చిపోకుండా పోతురాజు వేషదారని ధరించి, మన తెలంగాణ సంస్కృతి కోసం బోనాలు ఊరేగింపులో పాల్గొని వేడుకలకు సరికొత్త శోభను తీసుకొచ్చాడు. పోతురాజు విన్యాసాన్నీ ప్రవాసులే కాక హాజరైన ముఖ్య అతిధులు సైతం ప్రసంశించి సత్కరించారు.
హౌంస్లౌ నగర డిప్యూటీ మేయర్ ముహమ్మద్ షకీల్ అక్రమ్ మాట్లాడుతూ యూకే లో నివసిస్తున్న తెలంగాణ ఎన్నారైలంతా సమాజ సేవలో ఎంతో క్రియాశీలకంగా పాల్గొంటారని, వీరి స్ఫూర్తి చాలా గొప్పదని తెలిపారు. విదేశాల్లో ఉన్నపటికీ తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలని ప్రపంచానికి చాటి చెప్తున్న తీరు చాలా గొప్పగా ఉందన్నారు. స్థానికంగా ఎటువంటి సహాయం కావాలన్న నన్ను సంప్రదించవచ్చన్నారు. లండన్ నగరం భిన్న సంస్కృతుల ప్రజలు నివసించే నగరమని, మనమంతా ఐకమత్యంగా ఉండి పరస్పర సంప్రదాయాలని సంస్కృతిని గౌరవించుకుంటూ ముందుకు వెళ్లాలని తెలిపారు.
స్థానిక కౌన్సిలర్లు అజమీర్ గ్రేవాల్, ప్రీతమ్ గ్రేవాల్, ఆదేశ్ ఫర్మాహాన్, బంధన చోప్రా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర పండుగ “బోనాల” వేడుకల్ని ఎంతో ఘనంగా నిర్వహించడమే కాకుండా, సంప్రదాయ బద్దంగా పూజలు నిర్వహించి, అమ్మవారికి బోనం సమర్పించడానికి పెద్ద ఎత్తున మహిళలు బోనం నెత్తిన ఎత్తుకొని లండన్ వీధుల్లో రావడం చూస్తుంటే,ఎంతో గర్వంగా అనిపించిందన్నారు. తెలంగాణ సంస్కృతిని ప్రతి ఒక్కరికి తెలిసేలా టాక్ సంస్థ చేపడుతున్న కార్యక్రమాలు ఎందరికో ఆదర్శంగా ఉన్నాయన్నారు. బోనం చేసి వేడుకల్లో పాల్గొన్న మహిళలందరిని ప్రత్యేక సత్కరించి, బహుమతులందజేశారు.
ప్రముఖ నృత్య కళాకారిణి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ గ్రహీత, రాగసుధా వింజమూరి చేసిన నృత్యం వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
ఈ ఇవెంట్ స్పాన్సర్స్, అలాగే సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని సంస్థ ఎగ్జిక్యూటివ్ టీం జ్ఞాపిక లతో ప్రశంశించారు.
ఈ కార్యక్రమంలో టాక్ అద్యక్షులు రత్నాకర్ కడుదుల, అశోక్ దూసరి, శుష్మున రెడ్డి, సత్య చిలుముల , మట్టా రెడ్డి , వెంకట్ రెడ్డి , సురేష్ బుడగం , జహ్నవి వేముల , రవి రేతినేని , రవి ప్రదీప్ పులుసు , రాకేష్ పటేల్ , సత్యపాల్ , మల్లా రెడ్డి,గణేష్ కుప్పాల , సత్యం కంది , శ్రీకాంత్ జెల్ల , శ్రీధర్ రావు , మధుసూదన్ రెడ్డి , శైలజ జెల్ల ,స్నేహ , శ్వేతా మహేందర్ , స్వాతీ , క్రాంతి , పవిత్ర , సుప్రజ , శ్వేత , శ్రీ విద్య , నీలిమ , పృద్వి , మని తేజ ,గణేష్ పాస్తం , నిఖిల్ రెడ్డి , హరి గౌడ్ , నవీన్ రెడ్డి , కార్తీక్ , రంజిత్ , రాజేష్ వాక, మహేందర్, వంశీ , ఆనంద్ , అక్షయ్ , పావని , జస్వంత్ , శివ వెన్న , నాగ్ , మాడి, వినోద్ , సన్నీ , సందీప్ తదితరులు పాల్గొన్న వారిలో ఉన్నారు.