శిథిలాలను చీల్చుకుని..మృత్యుంజయినిగా నిలిచింది!

వెనిజులా భూకంపంలో కూలిన భవనం శిథిలాల కింద చిక్కుకున్న మహిళను రెస్క్యూ బృందాలు సజీవంగా బయటకు తీశాయి. ఈ ఘటన ఆశాకిరణంగా మారింది.

Reported by: Tejaswini Nanna | అంత‌ర్జాతీయం | Jun 26, 2026, 1:23 pm IST
Read Time: 3 mins
శిథిలాలను చీల్చుకుని..మృత్యుంజయినిగా నిలిచింది!

వెనిజులా భూకంపాలు రేపిన విషాదం ఆ దేశాన్ని తీవ్ర ప్రాణ, ఆస్తి నష్టాలకు గురి చేసింది. దాదాపుగా చీల్చుకుని బయటకు వచ్చింది.రాజధాని కారకాస్‌ సహా దేశవ్యాప్తంగా పలు నగరాల్లో ఈ భూప్రకంపనలతో అనేక భవనాలు కూలిపోగా…దాదాపు 40వేల మంది పౌరుల ఆచూకి లేకుండా పోయింది. ఇప్పటిదాక 235 మంది చనిపోయారని, మరో 4,300మంది గాయాలతో ఆసుపత్రి పాలయ్యారని ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజాగా వెల్లడించింది. ప్రపంచ దేశాలు వెనిజులాకు సహాయంగా ముందుకు వచ్చి అవసరమైన సహాయ, సహకారాలను అందిస్తున్నాయి.

అయితే వెనిజులాలో రెస్కూటీమ్ భూకంపంతో కూలిన ఓ బహుళ అంతస్తుల భవనం శిథిలాల నుంచి ఒక మహిళను ప్రాణాలతో బయటకు తీసిన వీడియో ఒకటి వైరల్ గా మారింది. ఆమె ప్రాణాలతో బయటపడటం చూసిన రెస్క్యూ టీమ్‌, స్థానికులు షాక్‌లో ఉండిపోయారు. శిధిలాల మధ్య నుంచి ఆమె ప్రాణాలతో ఉన్నవారి కోసం గాలింపు కొనసాగుతున్న తరుణంలో…సహాయక చర్యలు శిథిలాల కింద ఇంకా కొందర సజీవంగా ఉండవచ్చన్న ఆశలు కల్గిస్తున్నాయి.