Anasuya|జబర్ధస్త్ షోతో ఫుల్ పాపులారిటీ తెచ్చుకున్న అనసూయ ఎవరు ఊహించని క్రేజ్ తెచ్చుకుంది. బుల్లితెరకి గ్లామర్ అద్దిన ఈ బ్యూటీ నిత్యం ఏదో ఒక ఇష్యూతో వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. సోషల్ మీడియాలో యాక్టివ్ రోల్ పోషిస్తూ ఫ్యాన్స్తో టచ్లో ఉంటూ తన కెరీర్కి సంబంధించిన విషయాలని, పర్సనల్ విషయా
Anasuya|జబర్ధస్త్ షోతో ఫుల్ పాపులారిటీ తెచ్చుకున్న అనసూయ ఎవరు ఊహించని క్రేజ్ తెచ్చుకుంది. బుల్లితెరకి గ్లామర్ అద్దిన ఈ బ్యూటీ నిత్యం ఏదో ఒక ఇష్యూతో వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. సోషల్ మీడియాలో యాక్టివ్ రోల్ పోషిస్తూ ఫ్యాన్స్తో టచ్లో ఉంటూ తన కెరీర్కి సంబంధించిన విషయాలని, పర్సనల్ విషయాలని షేర్ చేస్తూ ఉంటుంది. బుల్లితెరపై క్రేజ్ తెచ్చుకున్న తర్వాత అనసూయ వెండితెరకి షిఫ్ట్ అయింది. మంచి మంచి పాత్రలు పోషిస్తూ సిల్వర్ స్క్రీన్పై సత్తా చాటుతోంది. రంగస్థలంలో రంగమ్మత్తగా నటించి ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకున్న అనసూయ ఆ మధ్య వచ్చిన పుష్ప సినిమాలో దాక్షాయణి పాత్ర పోషించి మెప్పించింది.
ఇప్పుడు పుష్ప- 2లో నటిస్తోంది అనసూయ భరద్వాజ్. అయితే వైవిధ్యమైన పాత్రలు షోషిస్తున్నప్పటికీ అనసూయకి పెద్దగా పేరు తెచ్చే సినిమాలు రావడం లేదు. వేశ్యగా చేసినప్పటికీ ఆమె గుర్తింపు రాలేదు. ఇటీవల అనసూయకి బ్యాడ్ టైం నడుస్తున్న నేపథ్యంలో ఫ్యామిలీతో కలిసి తన ఇంట్లోనే ప్రత్యేక పూజలు నిర్వహించింది. కుటుంబంతో కలిసి సాంప్రదాయబద్దంగా పూజలు నిర్వహించిన అనసూయ రానున్న రోజులలో మంచి అవకాశాలు అందుకోవడం ఖాయం అని అంటున్నారు. అయితే అనసూయ పూజల వెనుక పూర్తి క్లారిటీ లేకపోవడంతో నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు. పూజల వెనక కారణమేంటి? వేణుస్వామి సలహాలు, సూచనలతోనే ఈ పూజలు చేశారా అని అడుగుతున్నారు.
ఇక అప్పుడప్పుడు అనసూయ తన అభిమానులతో ముచ్చటిస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా తాజాగా సోషల్ మీడియాలో ఇంట్రాక్ట్ అయ్యారు. ఈ సందర్భంగా అభిమానులు అడిగిన ప్రశ్నలకు అనసూయ ఆసక్తికర సమాధానాలు ఇచ్చింది. ఓ అభిమాని మీరు ఒంటరిగా ఓ ట్రిప్ ప్లాన్ చేయవచ్చు కదా అని అడగగా, దీనికి ఆమె సమాధానం ఇస్తూ.. నిజానికి సింగిల్గా బయటకు వెళ్లాలంటే ఒకప్పుడు పిచ్చ భయమేసేది. కానీ ఇప్పుడు ఆలోచిస్తా అంటూ సోలో ట్రిప్ కోసం ఏదైనా ఐడియా ఇవ్వమని ఆ అభిమానిని కోరింది. అయితే భర్తని వదిలేసి సోలోగా ట్రిప్ వేయడానికి అనసూయ సిద్ధం కావడంతో కొందరు ట్రోల్ చేస్తున్నారు. భర్తను వదిలేసి ఒంటరిగానే ట్రిప్స్కు వెళ్లేందుకు రెడీ అయిపోయావా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.