విధాత, హైదరాబాద్ : బంగారం, వెండి ధరల హెచ్చు తగ్గులు కొనసాగుతున్నాయి. శుక్రవారం బులియన్ మార్కెట్ లో రూ.320 తగ్గి.. రూ.1,56,170 కి దిగివచ్చింది. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 300 తగ్గి.. రూ.1,43,150 వద్ద కొనసాగుతుంది. కిలో వెండి ధర రూ. నిన్నటి ధర రూ. 2,70,000వద్ద నిలకడగా నిలిచింది.
అమెరికా ద్రవ్యోల్బణం, యూఎస్ ఫెడరల్ రిజర్వు వడ్డీరేట్లను తగ్గుముఖం పట్టడం, మధ్యప్రాచ్యంలో ఇరాన్ పై అమెరికా యుద్ద సన్నాహాలతో పెరిగిన ఉద్రిక్తతల నేపథ్యంలో బంగారం, వెండి ధరలలో అస్థిరత కొనసాగనుందని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు. వెండి, బంగారం ధరలు ప్రస్తుతం తగ్గినప్పటికి దీర్ఘకాలికంగా పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
