విధాత, హైదరాబాద్ :
మియాపూర్లో అక్రమ కట్టడంపై హైడ్రా చర్యలు చేపట్టింది. ప్రభుత్వ భూమిలో నిర్మించిన 5 అంతస్తుల భవనం కూల్చివేసింది. అమీన్పూర్లో అనుమతులు తీసుకుని HMDA కు చెందిన మియాపూర్ ప్రభుత్వ భూమిలో అక్రమ కట్టడాలు నిర్మాణ చేపట్టారు. అమీన్పూర్లోని సర్వే నంబర్ 337, 338 సర్వే నంబర్ల పక్కనే ఉన్న మియాపూర్ 101 సర్వే నంబర్ లోని ప్రభుత్వ భూమిలోకి చొరబడి అక్రమ కట్టడాలు నిర్మించారు. అమీన్పూర్ సర్వే నంబర్ 337, 338 లలో హుడా అప్రూవ్డ్ లే అవుట్ లో 400ల గజాల 126 నెంబర్ ప్లాట్ కొని.. ఆ పక్కనే మియాపూర్ సర్వే నంబర్ 101 ప్రభుత్వ స్థలంలోకి భాను కన్స్ట్రక్షన్స్ యజమానులు చొరబడి 126/D , 126/ పార్ట్ 126/C గా ప్లాట్లుగా సృష్టించారు.
మియాపూర్లోని HMDA భూమిలోని దాదాపు 473 గజాలు కలుపుకొని భాను కన్స్ట్రక్షన్స్ యజమానులు ఎల్లారెడ్డి అండ్ అదర్స్ మొత్తం దాదాపు 873 గజాల మేర 5 అంతస్తుల భవనం నిర్మాణం చేపట్టారు. భాను కన్స్ట్రక్షన్స్ యజమానులు ఫేక్ ఎల్ఆర్ఎస్ (LRS) సృష్టించారు. దీంతో ఇప్పటికే అమీన్పూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయింది. ప్రభుత్వ స్థలంలోకి జరిగి నిర్మించిన 473 గజాల మేర ఉన్న భాగాన్ని హైడ్రా తొలగించింది. ప్రభుత్వ భూమిలోకి వచ్చి చేపట్టిన నిర్మాణం మేరకు హైడ్రా చర్యలు చేపట్టింది. ప్రభుత్వ భూమిలోకి జరిగి 5 అంతస్తుల నిర్మించడంపై హైడ్రాకు HMDA అధికారులు ఫిర్యాదు చేశారు.
దీంతో స్థానిక రెవెన్యూ, HMDA, మున్సిపాలిటీ అధికారులతో కలసి క్షేత్రస్థాయిలో హైడ్రా పరిశీలించి ప్రభుత్వ భూమిలోకి జరిగి అక్రమంగా భవనం నిర్మిస్తున్నట్టు హైడ్రా నిర్ధారించింది. అలాగే, 2014లో LRS ఫేక్ పత్రాల సృష్టించినట్టు గుర్తించింది. అన్నీ పరిశీలించిన తరువాత శనివారం మియాపూర్ పరిధిలోకి వచ్చిన భవనం మేరకు ఆక్రమణలు తొలగింపునకు చర్యలు చేపట్టింది.
