Sai Pallavi|లేడి పవర్ స్టార్ సాయి పల్లవి తెలుగు ప్రేక్షకులకి చాలా దగ్గరైంది. మలయాళ అమ్మాయి కూడా తెలుగు వారికి బాగా దగ్గరైంది. ఆమె ఓన్ డబ్బింగ్ చెప్పుకుంటూ తెలుగులో అదరగొడుతుంది. బలిసిందారా.. బొక్కలిరగ్గొడ్తా నకరాలా..!’ అని ఫిదా’లో అచ్చ తెలంగాణ యాసలో సాయి పల్లవి అదరగొట్టేసింది. సా
Sai Pallavi|లేడి పవర్ స్టార్ సాయి పల్లవి తెలుగు ప్రేక్షకులకి చాలా దగ్గరైంది. మలయాళ అమ్మాయి కూడా తెలుగు వారికి బాగా దగ్గరైంది. ఆమె ఓన్ డబ్బింగ్ చెప్పుకుంటూ తెలుగులో అదరగొడుతుంది. బలిసిందారా.. బొక్కలిరగ్గొడ్తా నకరాలా..!’ అని ఫిదా’లో అచ్చ తెలంగాణ యాసలో సాయి పల్లవి అదరగొట్టేసింది. సాయి పల్లవి చెప్పిన ప్రతి డైలాగ్ కూడా అందరికి కనెక్ట్ అయ్యాయి. భానుమతి పాత్రలో తెగ మెప్పించింది. ఆ సినిమాలో ఎడ్లబండి తోలడం, బురద పొలంలో ట్రాక్టర్ నడపడం వంటి రిస్క్స్ ఫేస్ చేసి మంచి పేరు తెచ్చుకుంది. ఇప్పుడు సాయి పల్లవికి స్టార్ హీరో రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ అమ్మడు ఒకవైపు కథానాయికగా నటిస్తూనే మరోవైపు మహిళా ప్రాధాన్యత ఉన్న పాత్రలు కలిగిన చిత్రాలు కూడా చేస్తూ వస్తున్న విషయం తెలిసిందే.
సాయి పల్లవి ఇప్పుడు అనేక భాషల్లో చిత్రాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది . ప్రస్తుతం నాగ చైతన్యతో కలిసి తండేల్ అనే మూవీ చేస్తుంది. ఈ మూవీపై భారీ అంచనాలే పెట్టుకుంది.అయితే ఇటీవల సాయి పల్లవికి సంబంధించి ఓ ఆసక్తికర విషయం కూడా బయటకు వచ్చింది. అదేంటంటే ఆమె ఒక కథని సిద్ధం చేస్తుందని, దర్శకత్వం వైపు కూడా అడుగులు వేసే ఆలోచన చేస్తున్నట్టుగా టాక్స్ వినిపించాయి. అయితే దీనిపై ఇప్పటి వరకు క్లారిటీ అయితే లేదు . శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ఈ చిన్నది హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వక ముందు ఓ సినిమాలో సైడ్ రోల్ లో నటించింది. ఈ విషయం చాలా తక్కువ మందికి తెలిసి ఉంటుంది.
బాలీవుడ్ లో కంగనా రనౌత్ హీరోయిన్ గా నటించిన ధామ్ ధూమ్ అనే సినిమాలో సాయి పల్లవి చిన్న పాత్రలో నటించింది. జయం రవి ప్రధాన పాత్రలో రూపొందిన ఈ చిత్రంలో సాయి పల్లవి చైల్డ్ ఆర్టిస్ట్ గా కనిపించిది. సాయి పల్లవి చైల్డ్ ఆర్టిస్ట్గా ఉన్నప్పుడే ఇరగదీసిందని, ఆమె టాలెంట్కి అవధులు లేవని కొందరు కామెంట్ చేస్తున్నారు. ఏది ఏమైన సాయి పల్లవి మాత్రం స్టార్ హీరోల మాదిరిగా నిత్యం ఏదో ఒక విషయంతో వార్తలలో నిలుస్తుంటుంది. ఈ అమ్మడు సెలక్టివ్గా సినిమాలు చేసుకుంటూ ముందుకు పోతుంది. లవ్ స్టోరీ చిత్రంలో నాగ చైతన్య తో కలిసి నటించి మంచి పేరు తెచ్చుకున్న సాయి పల్లవి ఇప్పుడు మరోసారి చైతూతో కలిసి తండేల్ సినిమా చేస్తుంది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.