లేడి సూపర్ స్టార్ నయనతార ప్రోఫెషనల్ లైఫ్ బాగానే ఉన్నా పర్సనల్ లైఫ్ మాత్రం చాలా డిస్ట్రబ్డ్గా ఉంది.ఆమె గతంలో ప్రభుదేవా, శింబులని ప్రేమించి ఆ తర్వాత బ్రేకప్ చెప్పింది. ఇక ఆ తర్వాత విఘ్నేష్ శివన్తో ప్రేమలో పడి కొన్నాళ్లపాటు ఆయనతో డేటింగ్ చేసి ఎట్టకేలకి పెళ్లి చేసుకుంది. ఇక సరోగసి ద్వారా ఇద్దరు పిల్లలకి జన్మనిచ్చింది కూడా. సరోగసి ద్వారా నయనతార తల్లి కావడం వివాదాస్పదం కావడం మనం చూశాం. పలు కేసులు కూడా నమోదు చేశారు. అయితే వాట్ననింటిని క్లియర్ చేసుకొని ప్రస్తుతం సంతోషంగా జీవనం సాగిస్తున్నారు నయనతార,విఘ్నేష్ శివన్ జంట. అయితే నయనతారపై ఇటీవలి కాలంలో చాలా మంది చాలా రకాల కామెంట్స్ చేస్తున్నారు.
ముఖ్యంగా పిల్లల విషయానికి వస్తే.. ఆమె సరోగసి ద్వారా పిల్లలని కనడానికి కారణం అందం కాపాడుకోవడం కోసం అని ప్రచారం జరిగింది. ప్రస్తుతం టాప్ హీరోయిన్గా దూసుకుపోతున్న ఈ భామ పిల్లలను కంటే తన బాడీ షేప్ ఔట్ అవుతుందని, బాడీలో వచ్చిన మార్పుల కారణంగా అందం కూడా కోల్పోతుందని, సినిమా అవకాశాలు కూడా తగ్గుతాయని భావించి సరోగని ఎంపిక చేసుకున్నట్టు ఇండస్ట్రీలో ఓ ప్రచారం నడిచింది. అయితే దీనిపై ప్రముఖ సంచలన, వివాదాస్పద జ్యోతిష్కుడు వేణు స్వామి షాకింగ్ కామెంట్స్ చేశారు.
ప్రచారంలో ఉన్నది అంతా అవాస్తవమని, అసలు కథ వేరే ఉందంటూ వేణు స్వామి షాకింగ్ కామెంట్స్ చేశాడు. అసలు నయనతార జాతకంలో సంతానమే లేదని, అందం కోసం ఆమె పిల్లలని కనడం లేదని జరుగుతుంది అవాస్తమని ఆయన అన్నారు. కాజల్ అగర్వాల్ పెళ్లి చేసుకుని పిల్లలు కని, మళ్లీ ఫిట్నెస్ తెచ్చుకుని సినిమాలు చేయడం లేదా, మిగతా హీరోయిన్స్ కూడా పిల్లలని కని ఆ తర్వాత మళ్లీ సినిమాలు చేస్తున్నారు కదా అని వేణు స్వామి అన్నారు. అయితే అందం కోసం ఆమె పిల్లలని కనలేదని వచ్చిన వార్తలు అవాస్తవం. ఆమెకి సంతాన యోగ్యం లేకనే సరోగసిని ఆశ్రయించిందన్నారు వేణు స్వామి. చాలా మంది సెలబ్రిటీలు కూడా ఇటీవల సరోగసి ద్వారానే పిల్లల్ని కంటున్నారని, బయటకు ప్రచారం జరిగేదంతే వేరే అని ఆయన చెప్పుకొచ్చారు. నయన్ ప్రస్తుతం ఆమె తమిళంలో `టెస్ట్`తోపాటు మరో సినిమాలో నటిస్తుంది.