విధాత: హర్యానాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మహేంద్రగడ్ సమీపంలో గురువారం ఉదయం 11 గంటల ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 20మంది గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అతివేగంతో ప్రయాణిస్తున్న బస్సు వేరే వాహనాన్ని దాటేందుకు ప్రయత్నించడంతో అదుపు తప్పి చెట్టును ఢీ కొట్టింది. దీంతో బస్సు పల్టీ కొట్టింది. ప్రమాదం జరిగిన వెంటనే బస్సు డ్రైవర్ అక్కడి నుంచి పారిపోయాడు. స్థానికుల సమాచారం మేరకు విషయం తెలుసుకున్న పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డ చిన్నారులను ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు రోధనలు మిన్నంటాయి. ఘటనపై స్థానికి ఎస్పీ మాట్లాడుతూ డ్రైవర్ను అదుపులోకి తీసుకొని ప్రమాద సమయంలో మద్యం సేవించాడా లేదా అని వైద్య పరీక్షలు చేసేందుకు తీసుకువెళ్లామన్నారు. మద్యం సేవించడం మూలంగా ప్రమాదం జరిగిందా లేదా అన్న విషయంతో రిపోర్ట్ తయారు చేయాలన్నారు. అయితే బస్సు ఆరు సంవత్సరాల క్రితమే ఫిట్నెస్ కోల్పోయిందన్నారు. కాలపరిమితి లేని బస్సుని ఉపయోగించడంతో పాఠశాల యాజమాన్యంపై కేసు నమోదు చేశామన్నారు.
హర్యానాలో ఘోరరోడ్డు ప్రమాదం.. ఎనిమిది మంది విద్యార్థులు మృతి.. 20 మందికి గాయాలు
విధాత: హర్యానాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మహేంద్రగడ్ సమీపంలో గురువారం ఉదయం 11 గంటల ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 20మంది గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అతివేగంతో ప్రయాణిస్తున్న బస్సు వేరే వాహనాన్ని దాటేందుకు ప్రయత్నించడంతో అదుపు తప్పి చెట్టును ఢీ కొట్టింది. దీంతో బస్సు పల్టీ కొట్టింది. ప్రమాదం జరిగిన వెంటనే బస్సు డ్రైవర్ అక్కడి నుంచి పారిపోయాడు. స్థానికుల సమాచారం […]
Latest News

Pillow Talk | పడుకునే ముందు 10 నిమిషాలు.. దంపతుల మధ్య అన్యోన్యతను పెంచే సూపర్ సీక్రెట్!
Toyota Innova Crysta | సరికొత్త లుక్.. అదిరిపోయే ఫీచర్లతో టయోటా ఇన్నోవా క్రిస్టా 2026 మోడల్ లాంచ్.. ధర ఎంతంటే..!
Tecno Pova 8 | 8000mAh భారీ బ్యాటరీతో టెక్నో నుంచి కొత్త స్మార్ట్ఫోన్.. లాంచ్ ఎప్పుడంటే..!
Credit Card Limit | మీ క్రెడిట్ కార్డు లిమిట్ను బ్యాంకులు అకస్మాత్తుగా తగ్గించేశాయా?
రూ.30వేల కోట్ల విలువైన భూమిని కాపాడాం: హైడ్రా
Parthiban | ఆ మధ్య త్రిషపై ఘాటు వ్యాఖ్యలు చేసిన ప్రముఖ నటుడు..ఇప్పుడు విజయ్ను కలిసి ప్రత్యేక పెయింటింగ్ బహుకరణ
హైటెక్స్ లో ‘థ్రెడ్ పోచంపల్లి’ప్రదర్శనను ప్రారంభించిన మంత్రులు
హైదరాబాద్లో ఎబోలా కలవరం
సైకిల్తో సవారి.. భవిష్యత్తుకు పచ్చని దారి : చంద్రబాబు
అగ్ని ప్రమాదాల నివారణపై సీఎం సమీక్షించాలి : కవిత