Gold Seize: వామ్మో ఒకే చోట..107కిలోల అక్రమ బంగారం సీజ్!

స్మగ్లింగ్‌ చేసిన అక్రమ బంగారాన్ని గుజరాత్ అహ్మదాబాద్ పాల్ది ప్రాంతంలోని అవిష్కార్ అపార్ట్‌మెంట్‌ లో పట్టుకున్నారు. ఏటీఎస్, డీఆర్ఐ బలగాలు రైడ్స్‌ చేసి 107 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.

Gold Seize: వామ్మో ఒకే చోట..107కిలోల అక్రమ బంగారం సీజ్!

Gold Seize: గుజరాత్‌ (Gujarat) రాష్ట్రం అహ్మదాబాద్‌ (Ahmedabad)లో భారీగా బంగారం పట్టుబడింది. ఏటీఎస్‌ పోలీసులు, డీఆర్‌ఐ అధికారులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో అహ్మదాబాద్‌లోని పాల్ది (Paldi) ప్రాంతంలో గల ఓ ఇంట్లో దాదాపు 107కిలోల అక్రమ బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బంగారం అక్రమ రవాణాపై నిఘా పెట్టిన పోలీసులు.. పక్కా సమాచారంతో దాడులు నిర్వహించారు.

 

స్మగ్లింగ్‌ చేసిన అక్రఅక్రమ బంగారాన్ని పాల్ది ప్రాంతంలో గల అవిష్కార్ అపార్ట్‌మెంట్‌ (Avishkar flat)లో దాచిపెట్టినట్లు గుర్తించారు. ఈ మేరకు రైడ్స్‌ చేసి 107 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అందులో 88 కేజీలు బంగారు కడ్డీలు, 19.66 కిలోల బంగారు ఆభరణాలు, 11 విలాసవంతమైన వాచీలు ఉన్నాయి. వీటిలో డైమండ్‌తో అలంకరించిన పటెక్ ఫిలిప్ గడియారం, జేకబ్ అండ్ కో టైంపీసు, ఫ్రాంక్ ముల్లర్ గడియారం ఉన్నాయి. పట్టుబడిన ఈ బంగారం విలువ మార్కెట్లో రూ.100 కోట్లకుపైమాటే అని అధికారుల అంచనా. బంగారంతోపాటు రూ.1.7 కోట్ల నగదును కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దాడిలో గుజరాత్ యాంటీ-టెర్రరిజం స్క్వాడ్ (ATS), డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) అధికారులు సంయుక్తంగా పాల్గొన్నారు.