Hyderabad | హైదరాబాద్ కుషాయిగూడ పోలీసు స్టేషన్లో ఘోరం జరిగింది. ఈ ప్రమాదంలో సూర్యాపేటకు చెందిన ఒకే కుటుంబంలోని ముగ్గురు సజీవ దహనం అయ్యారు.
ఆదివారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో కుషాయిగూడలో ఉన్న ఓ టింబర్ డిపోలో అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. ఆ టింబర్ డిపోకు పక్కనే ఉన్న ఓ భవనానికి మంటలు వ్యాపించాయి. దీంతో దంపతులతో పాటు చిన్నారి అగ్నికీలలకు బలైపోయారు.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేసింది. మృతులను యాదాద్రి భువనగిరి జిల్లా తుంగతుర్తి మండలం రెడ్డిగూడెంకి చెందిన నరేశ్(35), సుమ(28), జోషిత్(5)గా పోలీసులు గుర్తించారు. మరో చిన్నారి ఆచూకీ తెలియాల్సి ఉంది.
మృతుల కుటుంబ సభ్యులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను గాంధీ మార్చురీకి తరలించారు.
హైదరాబాదులో జీవిస్తున్న తమ గ్రామానికి చెందిన ఒకే కుటుంబ సభ్యులు అగ్ని ప్రమాదంలో ఆహుతలవ్వడంపై రెడ్డిగూడెంలో విషాదఛాయలు అమ్ముకున్నాయి.