మేడిగడ్డ ఎల్ ఆండ్ టీ కార్యాలయంలో అగ్ని ప్రమాదం..కీలక ఫైళ్లు దగ్ధం
మేడిగడ్డ బ్యారేజ్ వద్ద ఉన్న ఎల్ అండ్ టీ సంస్థకు చెందిన కార్యాలయంలో ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణానికి, నిర్వహణకు సంబంధించిన పలు కీలక డాక్యుమెంట్లు, ఫైళ్లు కాలి బూడిదైనట్లు సమాచారం.
విధాత: కాళేశ్వరం ప్రాజెక్టులోని కీలకమైన మేడిగడ్డ బ్యారేజ్ వద్ద ఉన్న నిర్మాణ సంస్థ ఎల్ ఆండ్ టీ((L&T)కార్యాలయంలో అగ్ని ప్రమాదం కలకలం రేపింది. ఎల్ అండ్ టీ సంస్థకు చెందిన కార్యాలయంలో ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణానికి, నిర్వహణకు సంబంధించిన పలు కీలక డాక్యుమెంట్లు, ఫైళ్లు కాలి బూడిదైనట్లు సమాచారం.
సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ సిబ్బంది అగ్నిమాపక యంత్రాలతో ఘటనా స్థలానికి చేరుకుని, మంటలను అదుపు చేయడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ ప్రమాదం ప్రమాదవశాత్తూ జరిగిందా లేక మరేదైనా కారణం ఉందా అనే కోణంలో పోలీసు అధికారులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. బ్యారేజీ పిల్లర్ల కుంగుబాటుపై పలు రకాల పరీక్షలు కొనసాగుతున్న క్రమంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకోవడం పలు సందేహాలకు తావిస్తుంది.
బ్రేకింగ్ న్యూస్
మేడిగడ్డ బ్యారేజీ దగ్గరున్న ఎల్ అండ్ టీ కార్యాలయంలో అగ్ని ప్రమాదం. మేడిగడ్డ బ్యారేజీకి సంబంధించిన కీలక డాక్యుమెంట్లు
కాలి బూడిదైనట్లు సమాచారం. ఇది ప్రమాదవశాత్తూ జరిగిందా? లేక ఎవరైనా ఉద్దేశపూర్వకంగా చేశారా అనే కోణంలో విచారిస్తున్న పోలీసులు. pic.twitter.com/3dkZUZkm9D— Tharun Reddy (@Tarunkethireddy) May 24, 2026
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram