Adipurush విధాత: భారీ అంచనాలతో రామాయణ ఇతిహాసాన్ని కథాంశంగా ఎంచుకుని ఐదు భాషల్లో విడుదలైన ఆదిపురుష్ కథలోని లోటుపాట్లతో, నిర్మాణ పరమైన తప్పిదాలతో ప్రజల ఆదరణ సంపాదించలేక పోయింది. అయితే ఆదిపురుష్ సినిమాలోని కొన్ని పాత్రల చిత్రీకరణ విషయంలో కూడా మార్పులు ఉండటంతో సినిమా హిందూ ప్రజలకు అంతగా నచ్చలేదు. ఇక 600 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా కలెక్షన్స్ కూడా అనుకున్నంతగా రాబట్టలేకపోయింది. ప్రభాస్, కృతి సనన్ సీతారాములుగా నటించిన ఆదిపురుష్ […]
Adipurush
విధాత: భారీ అంచనాలతో రామాయణ ఇతిహాసాన్ని కథాంశంగా ఎంచుకుని ఐదు భాషల్లో విడుదలైన ఆదిపురుష్ కథలోని లోటుపాట్లతో, నిర్మాణ పరమైన తప్పిదాలతో ప్రజల ఆదరణ సంపాదించలేక పోయింది. అయితే ఆదిపురుష్ సినిమాలోని కొన్ని పాత్రల చిత్రీకరణ విషయంలో కూడా మార్పులు ఉండటంతో సినిమా హిందూ ప్రజలకు అంతగా నచ్చలేదు. ఇక 600 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా కలెక్షన్స్ కూడా అనుకున్నంతగా రాబట్టలేకపోయింది.
ప్రభాస్, కృతి సనన్ సీతారాములుగా నటించిన ఆదిపురుష్ జూన్ 16న ప్రేక్షకుల ముందుకు వచ్చి పెద్దగా ప్రేక్షకాదరణ పొందకపోగా బోలెడు అపఖ్యాతిని మూటగట్టుకుంది. పాత్రలను తీర్చి దిద్దిన తీరు సరిగాలేదని, కథలో కొన్ని ఘట్టాలు మార్చి చిత్రీకరించారని, ముఖ్యంగా ఇంద్రజిత్తు, హనుమంతుడు మధ్య వచ్చే డైలాగ్స్పై తీవ్ర విమర్శలు ఎదుర్కొందీ సినిమా.
అసలు ఇలానేనా సినిమా తీసేది అంటూ అందరూ ఓ రేంజ్ని ఈ సినిమా మేకర్స్పై సీరియస్ అయ్యారు. మొదట్లో మేం తీసేందే రామాయణం అన్నట్లుగా బిల్డప్ ఇచ్చిన ‘ఆదిపురుష్’ రచయిత మనోజ్ ముంతాషిర్ శుక్లా.. ఆ తర్వాత సినిమా రిజల్ట్ చూసి, వచ్చిన కలెక్షన్స్ చూసి.. నివ్వెరపోయాడు. ముఖ్యంగా తనపై వచ్చిన విమర్శలకు దిగిరాక తప్పలేదు.
మొదట్లో వీరలెవల్లో తలకాయ ఎత్తి మాట్లాడిన ఆయన.. తాజాగా ప్రేక్షకులకు క్షమాపణలు చెప్పేశాడు. ప్రేక్షకుల మనోభావాలను దెబ్బతిసే విధంగా ఆదిపురుష్ సినిమా ఉన్నదని అంగీకరిస్తున్నాను. మా వల్ల ఇబ్బంది పడిన వారికి నా క్షమాపణలు అని తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టాడు. ఆ హనుమంతుడు మన అందరినీ ఐకమత్యంతో ఉంచాలని, దేశ సేవ చేసేందుకు ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నానని చెప్పుకొచ్చాడు మనోజ్.
ఓ పక్క ఆదిపురుష్ను ఒకప్పుడు వచ్చిన రామాయణ ఇతిహాసం ఆధారంగా వచ్చిన సినిమాలతో పోల్చుతూ నెట్టింట ఆదిపురుష్ సినిమా అలా లేదని, కథను పూర్తిగా మార్చేశారని, రాముడిగా ప్రభాస్ అందంగా లేడని, సీత పాత్రకు కృతి సరిపోలేదని, హనుమంతుడి విషయంలో కథను పూర్తిగా మార్చేశారని ఇలా చాలా రకాలుగా విమర్శలను ఎదుర్కుంటూ వచ్చిందీ సినిమా బృందం. ముఖ్యంగా ఆదిపురుష్ నిర్మాత ఓం రౌత్ విషయంలో అయితే మరీ దారుణమైన ట్రోల్స్ నెట్టింట చక్కర్లు కొట్టాయి.
ఇక అలాంటి సమయంలో రామాయణాన్ని అనుసరించి మా కథలేదని అప్పుడు, ఆ హనుమంతుడు మనల్ని ఐక్యంగా ఉంచాలని ఇప్పుడు.. ఆదిపురుష్ రచయిత బాగానే మాటలు మారుస్తున్నాడంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి మాటలతోనే అందర్నీ బురిడీ కొట్టించి.. ‘ఆదిపురుష్’ అప్రతిష్టపాలులో సగం పాత్ర పోషించావంటూ గట్టిగానే నెటిజన్లే ఏసుకుంటున్నారు. సినిమా విడుదలై దాదాపు నెలరోజులు అవుతున్నా.. ఇంకా ఈ సినిమాపై నెగిటివిటీ పోలేదనడానికి నెటిజన్ల కామెంట్సే సాక్ష్యం.