విధాత: ఉన్నన్నాళ్ళూ ఓడమల్లయ్య.. దిగిపోయాక బొడిమల్లయ్య అనేది చాలామంది లక్షణం. రాజకీయాల్లో ఈ బుద్ధి మరింత ఎక్కువమందిలో ఉంటుంది. తాను కొనసాగినన్నాళ్లు ఆ పార్టీ అధినేతను రాముడు.. భీముడు అని కీర్తించి ఆ పార్టీని వీడగానే ఆయనలోని అన్ని అవలక్షణాలు కనిపిస్తుంటాయి. ఇప్పుడు తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి(MLA Sridevi) కూడా అచ్చం అలాగే మాట్లాడుతున్నారు. క్రాస్ ఓటింగ్ వేశారన్న ఆరోపణ మీద ఆమెను వైసిపి(YCP) సస్పెండ్(Suspend) చేయగా ఇప్పుడు ఆమె బోలెడు మాటలు మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రి జగన్(CM […]
విధాత: ఉన్నన్నాళ్ళూ ఓడమల్లయ్య.. దిగిపోయాక బొడిమల్లయ్య అనేది చాలామంది లక్షణం. రాజకీయాల్లో ఈ బుద్ధి మరింత ఎక్కువమందిలో ఉంటుంది. తాను కొనసాగినన్నాళ్లు ఆ పార్టీ అధినేతను రాముడు.. భీముడు అని కీర్తించి ఆ పార్టీని వీడగానే ఆయనలోని అన్ని అవలక్షణాలు కనిపిస్తుంటాయి.
ఇప్పుడు తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి(MLA Sridevi) కూడా అచ్చం అలాగే మాట్లాడుతున్నారు. క్రాస్ ఓటింగ్ వేశారన్న ఆరోపణ మీద ఆమెను వైసిపి(YCP) సస్పెండ్(Suspend) చేయగా ఇప్పుడు ఆమె బోలెడు మాటలు మాట్లాడుతున్నారు.
ముఖ్యమంత్రి జగన్(CM Jagan)కి చెవులు మాత్రమే ఉంటాయని అవే పనిచేస్తాయని కళ్ళతో చూడరని ఆమె ఆరోపించారు. పక్క వారు చెప్పినదే జగన్ వింటారు అని అన్నారు.
జగన్ తన చుట్టూ ఉన్న వారి మాటలు విని తనను సస్పెండ్ చేశారని ఆమె వాపోయారు. తనను పిచ్చి కుక్కగా జమ కట్టి రోడ్డున పడేశారని నాలుగేళ్ల పాటు విధేయతతో విలువలతో వైసీపీకి తాను చేసిన సేవలు పార్టీ గుర్తించకపోగా తనను తప్పించేయడం బాధాకరమని ఆమె అన్నారు.
అమరావతిలో దందాలు జరుగుతున్నాయని ఇసుకను లారీలతో దోచుకుని పోతున్నారని అక్కడ అన్ని రకాలైన అవినీతి కార్యకలాపాలు జరుగుతూంటే అడ్డుకున్నాననే తనను సైడ్ చేశారని అన్నారు. దందాల ద్వారా వచ్చే డబ్బు ఎక్కడ నుంచి ఎక్కడకు ఎవరికి వెళ్తోందని ఆమె ప్రశ్నించారు. ఏపీలో నాలుగేళ్లలో ఏమి అభివృద్ధి జరిగిందని ఆమె నిలదీశారు.
"ఈ రాష్ట్రంలో దళితులకు రక్షణ ఏది ? నేను మరో డాక్టర్ సుధాకర్ లాగా చనిపోవాలని అనుకోవటం లేదు."
రాష్ట్రంలో దళితుల పరిస్థితి ఎలా ఉందో చెప్తున్న సొంత పార్టీ ఎమ్మెల్యే#DalitAtrocitiesInAP#ByeByeJaganIn2024 #PsychoPovaliCycleRavali #JaganPaniAyipoyindhi #JaganFailedCM #PsychoJagan pic.twitter.com/J1AVuMODA4— Telugu Desam Party (@JaiTDP) March 26, 2023
అమరావతిలో గత ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధిలో పది శాతం అయినా ఏపీలో చేశారా అని ఆమె జగన్ సర్కార్ ని ప్రశ్నించారు. అమరావతి మన రాజధాని అని ఆమె స్పష్టం చేశారు. మూడు రాజధానులు నినాదం తప్పుడు విధానం అని ఆమె చెప్పడం విశేషం. తాను అమరావతి రాజధాని ఎక్కడికీ పోదు అని చెబితేనే రైతులు తనకు ఓటేసి గెలిపించారని ఆమె అన్నారు.
అలాంటి అమరావతి రాజధానిని కాదనడం వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పు అన్నారు. తాను అమరావతి రైతుల విషయంలో ఇంతకాలం ఉదాశీనంగా ఉండి తప్పు చేశాను అని ఆమె అంటున్నారు. ఇక మీదట అమరావతి రైతుల పక్షాల తాను పోరాడుతాను అని ఆమె అన్నారు. ఈ రోజు నుంచి తనకు బానిస సంకెళ్ళు తెగిపోయాయని తాను ఇండిపెండెంట్ ఎమ్మెల్యేనని ఆమె అన్నారు.
అమరావతి రైతులకు, మహిళలకు తాను బాసటగా ఉంటానని ఆమె హామీ ఇచ్చారు. తన కుమార్తె ఢిల్లీలో చదువుతోందని ఏపీకి రాజధాని ఏదీ అని తన కుమార్తెను అంతా అడుగుతున్నారంటే ఏపీకి ఎంత పరువు తక్కువ అని ఆమె హాట్ కామెంట్స్ చేశారు. ఏపీకి తాను వస్తే వైసీపీ గూండాలు బతకనిస్తారో లేదో అని ఆమె సందేహం వ్యక్తం చేశారు. డాక్టర్ సుధాకర్ని చంపినట్లుగా తనను చంపేస్తారని ఆమె ఆందోళన వ్యక్తం చేసారు.
ఎవరైనా తాను ఓటేసిన చోట బల్ల కింద కూర్చుని చూసారా అని ఆమె ప్రశ్నించారు. తాను క్రాస్ ఓటింగ్ చేశాను అని ఎలా చెప్పగలుగుతారని ఆమె నిలదీశారు. ఓటు అన్నది భారత రాజ్యాంగం ప్రకారం రహస్యమైనదని దాన్ని అపహాస్యం చేస్తూ ఆ సాకుతో తనను పార్టీ నుంచి తప్పించారని ఆమె అవేదన వ్యక్తం చేశారు.