తపాలా శాఖ మరోమారు వడ్డీ రేట్లను పెంచుతూ నిర్ణయం తీసుకున్నది. ప్రజలకు మరింత ఆర్థిక చేయూతనిచ్చేందుకు పలు పథకాల వడ్డీ రేట్లను పెంచింది
విధాత ప్రతినిధి, పెద్దపల్లి: తపాలా శాఖ మరోమారు వడ్డీ రేట్లను పెంచుతూ నిర్ణయం తీసుకున్నది. ప్రజలకు మరింత ఆర్థిక చేయూతనిచ్చేందుకు పలు పథకాల వడ్డీ రేట్లను పెంచింది. జనవరి నుంచి మార్చి 31 వరకు ఈ కొత్త వడ్డీ రేట్లు వర్తించనున్నాయి. ఈ మేరకు గోదావరిఖని సబ్ డివిజన్ పోస్టల్ ఇన్స్పెక్టర్ శ్రీనాథ్ రెడ్డి బుధవారం పత్రికా ప్రకటన విడుదల చేశారు. తపాల శాఖలో ఉన్న పలు పథకాల వడ్డీ రేట్లను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని ఆయన పేర్కొన్నారు. కొత్త వడ్డీ రేట్లను ప్రజలకు వర్తింపచేయాలనే లక్ష్యంతో అన్ని పోస్టాఫీసుల్లో ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
పెరిగిన వడ్డీ రేట్ల ప్రకారం సేవింగ్స్ డిపాజిట్ పై 4.0%, ఒక సంవత్సరం టైమ్ డిపాజిట్ 6.9%, రెండు సంవత్సరాల టైమ్ డిపాజిట్ 7.0, మూడు సంవత్సరాల టైమ్ డిపాజిట్ 7.1, ఐదు సంవత్సరాల టైమ్ డిపాజిట్ 7.5, ఐదు సంవత్సరాల రికరింగ్ డిపాజిట్ 6.7, సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ 8.2, నెలవారీ ఆదాయ ఖాతా పథకం 7.4, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ 7.7, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ పథకం 7.1, సుకన్య సమృద్ధి ఖాతా పథకం 8.2% పెంచినట్లు పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాల కోసం మీ దగ్గరలో ఉన్న పోస్టాఫీసుల్లో సంప్రదించాలని కోరారు.