Site icon vidhaatha

NTPC | ఎన్టీపీసీలో సమ్మెలపై నిషేధం

విధాత బ్యూరో, కరీంనగర్: రామగుండం నేషనల్ థర్మల్ పవర్ స్టేషన్ (NTPC) లో ఉద్యోగులు, కార్మికులు సమ్మెలు, ధర్నాలు నిర్వహించడంపై ప్రభుత్వ నిషేధం విధించింది.

ఆరు నెలల పాటు ఎన్టీపీసీలో సమ్మెలు, ధర్నాలపై నిషేధం విధించినట్టు కేంద్ర ఇంధనశాఖ కార్యదర్శి సునీల్ శర్మ ప్రకటించారు.

ఈ నిబంధనలు ఈనెల 14వ తేదీ నుంచి అమలులోకి వచ్చాయి. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలుంటాయని కేంద్ర ప్రభుత్వం హెచ్చరిక జారీ చేసింది.

Exit mobile version