Rajasingh సీఎం కేసీఆర్ కు రాజాసింగ్ విన్నపం విధాత: తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో ఆదివారం గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో నా స్థానంలో ఎవరు గెలుస్తారో తెలియదని, నేను మాత్రం అసెంబ్లీకి రానని నమ్ముతున్నానని, నేను తిరిగి అసెంబ్లీకి రాకుండా నా చుట్టూ చాలా రాజకీయాలు జరుగుతున్నాయన్నారు. నా సొంత వారు.. బయటి వారు కూడా నన్ను రాకుండా చేయాలని చూస్తున్నారని, సీఎం కేసీఆర్ కు నాదొక విన్నపమని.. […]
Rajasingh
సీఎం కేసీఆర్ కు రాజాసింగ్ విన్నపం
విధాత: తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో ఆదివారం గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో నా స్థానంలో ఎవరు గెలుస్తారో తెలియదని, నేను మాత్రం అసెంబ్లీకి రానని నమ్ముతున్నానని, నేను తిరిగి అసెంబ్లీకి రాకుండా నా చుట్టూ చాలా రాజకీయాలు జరుగుతున్నాయన్నారు.
నా సొంత వారు.. బయటి వారు కూడా నన్ను రాకుండా చేయాలని చూస్తున్నారని, సీఎం కేసీఆర్ కు నాదొక విన్నపమని.. నేను ఉన్నా లేకున్నా నా గోషామహల్ నియోజకవర్గం ప్రజలపై మీరు దయ చూపాలని ప్రార్ధన అంటూ ఉద్వేగ భరితంగా మాట్లాడారు.
గోషామహల్ నియోజకవర్గం ప్రజల కోసం తన పరిధిలో చేయాల్సిదంతా చేశానని, తన పరిధిలోని నియోజకవర్గం సమస్యలపై, ప్రభుత్వం చేయాల్సిన పనులపై తాను ఎన్నికైన నాటి నుంచి అనే వేదికల మీద, అసెంబ్లీ సమావేశాల్లో పదేపదే చెప్పడం జరిగిందన్నారు.
ప్రభుత్వం గోషామహల్ నియోజకవర్గంను విస్మరించడం బాధా కరమన్నారు. గుడుంబా నిషేధం తర్వాత నియోజకవర్గ వాసుల్లో చాలా మంది ఉపాధి కోల్పోయారని, అలాంటి వారికి ప్రత్యామ్నాయ ఉపాధికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు.
కాగా రాజాసింగ్ ఓ వర్గంపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న వివాదంలో ఆయనపై బీజేపీ సస్పెండ్ వేటు వేసింది. కొద్దికాలానికి సస్పెన్షన్ ఎత్తివేస్తారని భావించినప్పటికీ ఆ దిశగా ఇప్పటికి పురోగతి లేదు. ఈ నేపథ్యంలో అసెంబ్లీకి తాను మళ్లీ వస్తానో రానో అంటు రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపాయి.
గోషామహల్ నుంచి గెలిచిన బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ ఉద్వేగానికి లోనయ్యారు. తనకు ఇవే ఆఖరి అసెంబ్లీ సమావేశాలు అని, రానున్న అసెంబ్లీలో తాను ఉండకపోవచ్చని అన్నారు. శనివారం అయన సభలో మాట్లాడుతూ తాను వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీ చేయడం లేదని అన్నారు.
ముస్లింలకు వ్యతిరేకంగా, ఇంకా మత విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రసంగించారు అని భావించిన ప్రభుత్వం 25 ఆగస్టు 2022 లో అరెస్ట్ అయ్యారు. అయితే ఆ తరువాత అయన నవంబర్లో విడుదల అయ్యారు. ఈలోపు ఆయన్ను బిజెపి సస్పెండ్ చేసేసింది.
ఇదిలా ఉండగానే అయన ఆమధ్య హరీష్ రావును కలవడంతో పలు పుకార్లు వచ్చాయి. అయన బిజెపిని వీడతారని, కేసీఆర్ సారధ్యంలోని భారత రాష్ట్ర సమితిలో చేరతారని పుకార్లు వచ్చాయి. అయితే తనమీద ఉన్న సస్పెన్షన్ ఇంకా బిజెపి తొలగించలేదు.
ఒకవేళ ఆ సస్పెన్షన్ రద్దు చేస్తే తాను ఎంపీగా పోటీ చేసే అవకాశాలు ఉన్నాయ్. అయితే తానూ బిజెపిని వీడేదిలేదని అయన అంటున్నారు. ఆయన్ను ఎంపీగా పోటీ చేయిస్తే ఎమ్మెల్యేసీట్ల మీద కూడా ప్రభావం ఉంటుందని, అక్కడ సైతం బిజెపి గెలించేందుకు మార్గం సులభం అవుతుందని పార్టీ భావిస్తోంది.
ఈ నేపథ్యంలో ఆయన్ను ఈసారి లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయించే అవకాశం ఉంటుందని అంటున్నారు. ఏది ఏమైనా ఆయన మాత్రం ఈసారి ఎమ్మెల్యేగా పోటీ చేసేది లేదని తెలుస్తోంది.