BRS | ఎన్నికల మేనిఫెస్టో విడుదల వరంగల్ సెంటిమెంటుకు ప్రాధాన్యత విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: రానున్న ఎన్నికలకు బీఆర్ఎస్ ప్రచార శంఖారావాన్ని వరంగల్ నుంచి ప్రారంభించనున్నారు. తొలి విడతలోనే 105 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించి ఒక విధమైన ఎన్నికల ప్రచారానికి ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ తెరతీశారు. అధికారికంగా పార్టీ అధినేత స్థాయిలో వరంగల్ నుంచి ఎన్నికల ప్రచార సైరన్ మోగించేందు సిద్ధమయ్యారు. అక్టోబర్ 16న వరంగల్ లో భారీ ర్యాలీ, బహిరంగ సభ […]
BRS |
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: రానున్న ఎన్నికలకు బీఆర్ఎస్ ప్రచార శంఖారావాన్ని వరంగల్ నుంచి ప్రారంభించనున్నారు. తొలి విడతలోనే 105 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించి ఒక విధమైన ఎన్నికల ప్రచారానికి ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ తెరతీశారు. అధికారికంగా పార్టీ అధినేత స్థాయిలో వరంగల్ నుంచి ఎన్నికల ప్రచార సైరన్ మోగించేందు సిద్ధమయ్యారు.
అక్టోబర్ 16న వరంగల్ లో భారీ ర్యాలీ, బహిరంగ సభ నిర్వహించేందుకు ఇప్పటికే నిర్ణయించారు. తాజాగా ఇదే విషయాన్ని కేసీఆర్ సోమవారం వెల్లడించారు. ఈ సభ వేదికగా ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించనున్నట్లు స్పష్టం చేశారు.
ఈ సభ కోసం ఇప్పటికే జిల్లా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు దేవన్నపేటలోని 150 ఎకరాల స్థలాన్ని ప్రాథమికంగా పరిశీలించారు. అనుకూలమైన స్థలాన్వేషణ కొనసాగుతోంది. భారీ స్థాయిలో జరిగే ఈ సభ కోసం ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు పూర్తిగా వచ్చే నెల నుంచి భాగస్వామ్యం కానున్నారు.
ఉత్తర తెలంగాణకు కేంద్రంగా ఉన్న వరంగల్ వేదికగా ఈ సభ నిర్వహించి చుట్టూ ఉన్న కరీంనగర్, ఖమ్మంతో పాటు నిజామాబాద్ జిల్లాల పై ప్రభావం పడే విధంగా ఈ సభకు రూపకల్పన చేస్తున్నారు. ప్రస్తుతం ఉత్తర తెలంగాణలో పార్టీ కొంత పరీక్షను ఎదుర్కొంటోంది.
సిటింగ్ లకే పూర్తి స్థాయిలో టికెట్లు కేటాయించినందున ఆ ఉత్సాహంతో ఈ సభ నిర్వహణను భుజాలకెత్తుకునే అవకాశం ఉంది. పైగా వరంగల్ అంటే కేసీఆర్ కు కొంత సెంటిమెంట్ కూడా ఉన్నందున ఈ ప్రాంతాన్ని ఎంచుకున్నట్లు భావిస్తున్నారు.