Site icon vidhaatha

మూసీ క్లీనింగ్ ప్ర‌క్రియ‌ను పూర్తి చేయండి


విధాత‌: మూసీ న‌ది క్లీనింగ్ ప్ర‌క్రియ‌ను ముందుగా పూర్తి చేయాల‌ని అధికారులను ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. సోమ‌వారం మూసీ నదీ పరివాహక అభివృద్ధిపై నానక్ రామ్ గూడ హెచ్ఎండీఏ కార్యాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో సమీక్ష నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా అధికారులు మూసీ రివర్ బౌండరీస్ లొకేషన్ స్కెచ్ తో పాటు పలు వివరాలను సీఎం కు వివరించారు.


మూసీ అభివృద్ధి ప్రక్రియ వీలైనంత త్వరగా ప్రారంభించేందుకు కసరత్తు పూర్తి చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. నగరంలోని చారిత్రక కట్టడాలను కలుపుతూ ఉండేలా మూసీ అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలన్నారు. అధికారులకు పని విభజన చేసి మూసీ నదీ పరివాహక అభివృద్ధికి చర్యలు వేగవంతం చేయాలని ఆయ‌న సూచించారు.

Exit mobile version