TS Secretariat | సెక్రటేరియట్‌ ముట్టడికి.. కానిస్టేబుల్ అభ్యర్థుల యత్నం

TS Secretariat విధాత: పోలీస్‌ కానిస్టేబుల్‌ అభ్యర్థులు సెక్రటేరియట్‌ను ముట్టడించారు. జీవో 46ను రద్దు చేసి, పాత విధానంతో నియామకాలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. నియామకాల్లో తమకు తీవ్ర అన్యాయం జరుగుతుందని భావించిన పోలీసు కానిస్టేబుల్‌ అభ్యర్థులు తమ గోడు ప్రభుత్వానికి వినిపించడానికి బుధవారం సచివాలయాన్ని ముట్టడించడానికి వచ్చారు. దాదాపు 50 మందికిపై పైగా పోలీస్‌ కానిస్టుబుల్‌ అభ్యర్థులు తమకు న్యాయం చేయాలని డిమండ్‌ చేస్తూ అమరుల స్మృతి వనం వైపు నుంచి రోడ్డు దాటుకుంటూ సచివాలయ […]

  • Publish Date - July 26, 2023 / 12:07 PM IST

TS Secretariat

విధాత: పోలీస్‌ కానిస్టేబుల్‌ అభ్యర్థులు సెక్రటేరియట్‌ను ముట్టడించారు. జీవో 46ను రద్దు చేసి, పాత విధానంతో నియామకాలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. నియామకాల్లో తమకు తీవ్ర అన్యాయం జరుగుతుందని భావించిన పోలీసు కానిస్టేబుల్‌ అభ్యర్థులు తమ గోడు ప్రభుత్వానికి వినిపించడానికి బుధవారం సచివాలయాన్ని ముట్టడించడానికి వచ్చారు.

దాదాపు 50 మందికిపై పైగా పోలీస్‌ కానిస్టుబుల్‌ అభ్యర్థులు తమకు న్యాయం చేయాలని డిమండ్‌ చేస్తూ అమరుల స్మృతి వనం వైపు నుంచి రోడ్డు దాటుకుంటూ సచివాలయ ప్రధాన ద్వారం గుండా లోపలికి వెళ్లే ప్రయత్నం చేశారు.

ఒక్కసారిగా గేటు వైపుకు దూసుకు వస్తున్నపోలీస్‌ కానిస్టేబుల్‌ అభ్యర్థులను పోలీసులు అడ్డుకొని, వ్యాన్లలోకి ఎక్కించి అక్కడి నుంచి ముషీరాబాద్‌, దోమల్‌గూడ, చిక్కడపల్లి పోలీస్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా పోలీస్‌ కానిస్టేబుల్‌ అభ్యర్థులు జీవో 46ను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు.

తమకు న్యాయం జరిగే విధంగా పాత విధానంలో నియామకాలు చేపట్టాలని కోరారు. కాగా సచివాలయం ముట్టడికి వచ్చిన కానిస్టేబుల్‌ అభ్యర్థులు 50 మందిపై సైఫాబాద్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.

Latest News