Mutton Curry | మాంసాహారం అంటే కొందరు ఉరకలేస్తుంటారు.. ఎప్పుడెప్పుడు తినాలా అని ఆలోచిస్తుంటారు. ఆ ఆహారం కోసం ఎదురుచూస్తుంటారు. అలానే ఓ వ్యక్తికి మాంసాహారం భలే ఇష్టం. ఇక ఇంటికి మటన్ తీసుకొచ్చాడు. కానీ భార్య తిరస్కరించింది. మంగళవారం రోజు ఇంట్లో మటన్ వండుతావా? అంటూ ప్రశ్నించింది. దీంతో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. భార్యాభర్తల మధ్య వివాదాన్ని పరిష్కరించేందుకు వచ్చిన ఓ వ్యక్తిని దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్ […]
Mutton Curry | మాంసాహారం అంటే కొందరు ఉరకలేస్తుంటారు.. ఎప్పుడెప్పుడు తినాలా అని ఆలోచిస్తుంటారు. ఆ ఆహారం కోసం ఎదురుచూస్తుంటారు. అలానే ఓ వ్యక్తికి మాంసాహారం భలే ఇష్టం. ఇక ఇంటికి మటన్ తీసుకొచ్చాడు. కానీ భార్య తిరస్కరించింది. మంగళవారం రోజు ఇంట్లో మటన్ వండుతావా? అంటూ ప్రశ్నించింది. దీంతో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. భార్యాభర్తల మధ్య వివాదాన్ని పరిష్కరించేందుకు వచ్చిన ఓ వ్యక్తిని దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. భోపాల్ లో పప్పు అర్హ్ వార్ అనే వ్యక్తి తన భార్యతో కలిసి ఉంటున్నాడు. అయితే మంగళవారం రోజు ఇంటికి మటన్ తీసుకొచ్చాడు. వండాలని భార్యను ఆదేశించాడు. కానీ మంగళవారం హనుమాన్ పూజిస్తానని మటన్ వండనని తేల్చిచెప్పింది. అసలు ఇంట్లోకి మటన్ ఎందుకు తెచ్చావని ప్రశ్నించింది. ఇక భర్తే వంట చేసేందుకు ప్రిపేర్ అవుతున్నాడు. ఈ క్రమంలోనే భార్యాభర్తల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది.
వీరి గొడవను పక్కింట్లో ఉన్న బిల్లు(45) విన్నాడు. పప్పు ఇంటికి చేరుకున్న బిల్లు.. భార్యాభర్తలకు సర్దిచెప్పాడు. గొడవ ఆగిపోయింది. ఆ తర్వాత బిల్లు అక్కడ్నుంచి వెళ్లిపోయాడు. తీవ్ర అవమానానికి గురైన పప్పు.. బిల్లు ఇంటికి ఆవేశంగా వెళ్లాడు. కర్రతో తలపై బాదడంతో కుప్పకూలిపోయాడు. తీవ్ర రక్తస్రావం జరిగింది. బిల్లు అరుపులు విన్న స్థానికులు అక్కడికి చేరుకున్నారు. అంతలోనే పప్పు జారుకున్నాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పప్పును ఆస్పత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పప్పు ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు.