Covid-19 | దేశంలో కరోనా మహమ్మారి మరోసారి కలవరం సృష్టిస్తున్నది. గత 24 గంటల్లో 1,590 మందికి వైరస్ సోకింది. వైరస్ కారణంగా ఆరుగురు మృతి చెందారు. గడిచిన 146 రోజుల్లో ఒక్క రోజులో నమోదైన అత్యధిక కరోనా కేసులు ఇవే. కేంద్ర కుటుంబ, ఆరోగ్య సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రకారం.. గత ఐదువారాల్లో దేశంలో సంక్రమణ కేసులు తొమ్మిది రెట్లు పెరిగాయి. పెరుగుతున్న ముప్పును దృష్టిలో పెట్టుకొని టెస్ట్-ట్రాక్-ట్రీట్-వ్యాక్సినేషన్పై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, కోవిడ్ను ఎదుర్కొనేందుకు […]
Covid-19 | దేశంలో కరోనా మహమ్మారి మరోసారి కలవరం సృష్టిస్తున్నది. గత 24 గంటల్లో 1,590 మందికి వైరస్ సోకింది. వైరస్ కారణంగా ఆరుగురు మృతి చెందారు. గడిచిన 146 రోజుల్లో ఒక్క రోజులో నమోదైన అత్యధిక కరోనా కేసులు ఇవే. కేంద్ర కుటుంబ, ఆరోగ్య సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రకారం.. గత ఐదువారాల్లో దేశంలో సంక్రమణ కేసులు తొమ్మిది రెట్లు పెరిగాయి.
పెరుగుతున్న ముప్పును దృష్టిలో పెట్టుకొని టెస్ట్-ట్రాక్-ట్రీట్-వ్యాక్సినేషన్పై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, కోవిడ్ను ఎదుర్కొనేందుకు తగిన ప్రవర్తనకు కట్టుబడి ఉండాలని మంత్రిత్వశాఖ అన్ని రాష్ట్రాలకు సూచించింది. దేశంలో పెరుగుతున్న కేసులకు Omicron సబ్ వేరియంట్ XBB.1.16 కారణమని భావిస్తున్నారు.
ఇతర వేరియంట్ల కంటే ఈ సబ్ వేరియంట్కు వేగంగా సోకుతుంది. ఈ కొత్త వేరియంట్ రోగనిరోధక శక్తిని సైతం తప్పించుకొని ప్రభావం చూపుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. అదే సమయంలో దేశంలోని పలు రాష్ట్రాల్లో కేసులు పెరుగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో కొత్తగా 152 కొవిడ్ కేసులు పెరిగాయి. 6.66శాతం పాజిటివిటీ రేటుతో కేసులు నమోదయ్యాయి.
అంతకుముందు రోజు అంటే గురువారం 117 మందికి కేసులు రికార్డయ్యాయి. అంతకు ముందు అక్టోబర్లో ఢిల్లీలో ఒక్కరోజులోనే వందకుపైగా కొత్త కేసులు వెలుగు చూశాయి. అలాగే మహారాష్ట్రలోనూ శుక్రవారం 343 కొత్త కేసులు నమోదవగా.. ముగ్గురు మృతి చెందారు. కొత్త కేసులతో యాక్టివ్ కేసుల సంఖ్య 1,763కి చేరింది.