Site icon vidhaatha

SURYAPET: రోడ్డు ప్రమాదంలో తండ్రి కొడుకుల మృతి.. చావుబతుకుల్లో భార్య

విధాత, నల్లగొండ బ్యూరో: సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల వద్ద లారీ, బైక్ ఢీ కొన్న ఘటనలో ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. నేరేడుచర్లకు చెందిన సత్యనారాయణ , కొడుకు, భార్యతో కలిసి బైక్ పై మిర్యాలగూడకు వెళ్తుండగా రామగిరి వద్ద లారీ ఢీ కొట్టింది.

ప్రమాదంలో సత్యనారాయణతో పాటు అతని కుమారుడు జశ్వంత్ లు అక్కడికక్కడే చనిపోగా, భార్య తీవ్ర గాయాలపాలైంది. ఆమెను ఆసుపత్రికి తరలించారు తరలించారు ఆమె పరిస్థితి విషమంగా ఉంది.

Exit mobile version