Fertilizer Prices | ఎరువుల ధరలు పెంచట్లేదు: కేంద్ర ప్ర‌భుత్వం

Fertilizer Prices విధాత‌: ఎరువుల ధరలపై కేంద్ర మంత్రి వర్గం కీలక నిర్ణయం తీసుకున్నది. ఈసారి ధరలు పెంచడం లేదని తెలిపింది. వానాకాలం సీజన్‌లో ఎరువులకు రూ. 1.08 లక్షల కోట్ల సబ్సిటీ ఇవ్వడానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయా వెల్లడించారు. యూరియాకు రూ. 70 వేల కోట్లు, డీఏపీకి రూ. 38 వేల కోట్లు రాయితీ ఇవ్వాలని నిర్ణయించినట్టు చెప్పారు. గత ఏడాది ఎరువుల రాయితీకి కేంద్ర […]

Reported by: CH RAJITHA | latest | IST
Read Time: 1 mins

Fertilizer Prices

విధాత‌: ఎరువుల ధరలపై కేంద్ర మంత్రి వర్గం కీలక నిర్ణయం తీసుకున్నది. ఈసారి ధరలు పెంచడం లేదని తెలిపింది. వానాకాలం సీజన్‌లో ఎరువులకు రూ. 1.08 లక్షల కోట్ల సబ్సిటీ ఇవ్వడానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

ఈ విషయాన్ని కేంద్ర మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయా వెల్లడించారు. యూరియాకు రూ. 70 వేల కోట్లు, డీఏపీకి రూ. 38 వేల కోట్లు రాయితీ ఇవ్వాలని నిర్ణయించినట్టు చెప్పారు. గత ఏడాది ఎరువుల రాయితీకి కేంద్ర రూ. 2.56 లక్షల కోట్లు ఖర్చు చేసిందని కేంద్రమంత్రి వెల్లడించారు.