శేరిలింగంపల్లిలో భారీగా గంజాయి పట్టివేత
శేరిలింగంపల్లిలో టాస్క్ఫోర్స్ పోలీసులు 10 కేజీల గంజాయి పట్టుకుని సీజ్ చేశారు. ఒడిస్సా నుండి ఆంధ్ర మీదుగా హైదరాబాద్కు గంజాయిని పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లో స్మగ్లింగ్ చేస్తున్నారు.

- 10కేజీల గంజాయి సీజ్
విధాత : శేరిలింగంపల్లిలో టాస్క్ఫోర్స్ పోలీసులు 10 కేజీల గంజాయి పట్టుకుని సీజ్ చేశారు. ఒడిస్సా నుండి ఆంధ్ర మీదుగా హైదరాబాద్కు గంజాయిని పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లో స్మగ్లింగ్ చేస్తున్నారు. గంజాయిని హైదరాబాద్లో విక్రమ్ అనే వ్యక్తికి అప్పగించే ప్లాన్ చేస్తుండగా, ఒడిస్సా కు చెందిన రాహుల్ అనే యువకుడిని రెడ్ హాండెడ్ గా టాస్క్ఫోర్సు పోలీసులు పట్టుకున్నారు.
గంజాయి చిన్న చిన్న ప్యాకెట్స్ లో ప్యాకింగ్ చేసి గచ్చిబౌలి ప్రాంతంలో సాఫ్ట్వేర్ ఇంజినీర్లకు, ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులకు విక్రమ్కు విక్రయిస్తున్నారు. హైదరాబాద్కు చెందిన విక్రమత్తో పాటు ఒడిస్సాకు చెందిన జగన్నాథ్ బిస్వా కూడా పరారీలో ఉన్నారు. ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లుగా శేరిలింగంపల్లి ఎక్సైజ్ పోలీసులు తెలిపారు.