రూ.లక్ష, బంగారం, కిలో వెండి గిఫ్ట్గా ఇచ్చిన టూరిజం మినిస్టర్
విధాత: దీపావళి పండుగ అనగానే స్వీట్లను గిఫ్ట్గా ఇస్తారు. లేదంటే కొత్త బట్టలను కానుకగా అందిస్తారు. కానీ ఈ మంత్రి మాత్రం తన కేడర్కు విలువైన కానుకలను అందించి వివాదంలో చిక్కుకున్నారు. తన నియోజకవర్గం పరిధిలోని మున్సిపల్ కార్పొరేషన్, గ్రామ పంచాయతీ సభ్యులకు ఎవరూ ఊహించని విధంగా రూ.లక్ష నగదు, బంగారం, వెండిని కానుకగా అందించి, వార్తల్లో నిలిచారు. కర్ణాటకకు చెందిన టూరిజం మంత్రి ఆనంద్ సింగ్.. శోభిత ధూళిపాళ కండోమ్ యాడ్.. ఆ భంగిమలకు […]

విధాత: దీపావళి పండుగ అనగానే స్వీట్లను గిఫ్ట్గా ఇస్తారు. లేదంటే కొత్త బట్టలను కానుకగా అందిస్తారు. కానీ ఈ మంత్రి మాత్రం తన కేడర్కు విలువైన కానుకలను అందించి వివాదంలో చిక్కుకున్నారు.
తన నియోజకవర్గం పరిధిలోని మున్సిపల్ కార్పొరేషన్, గ్రామ పంచాయతీ సభ్యులకు ఎవరూ ఊహించని విధంగా రూ.లక్ష నగదు, బంగారం, వెండిని కానుకగా అందించి, వార్తల్లో నిలిచారు. కర్ణాటకకు చెందిన టూరిజం మంత్రి ఆనంద్ సింగ్..
తన నియోజకవర్గంలోని మున్సిపల్ కార్పొరేషన్, గ్రామ పంచాయతీ సభ్యులకు దీపావళి వేళ ఊహించని బహుమతులను అందజేశారు. కార్పొరేషన్ సభ్యులకు రూ. లక్ష నగదు, 144 గ్రాముల బంగారం, కిలో వెండి, ఒక చీర, ధోతీతో పాటు డ్రై ఫ్రూట్స్ను అందజేశారు.
గ్రామపంచాయతీ సభ్యులకు కిలో వెండి, చీర, ధోతితో పాటు డ్రై ఫ్రూట్స్ అందించారు. బంగారం ఇవ్వలేదు. ఇక రూ. లక్ష కంటే తక్కువ నగదు అందించారు. మున్సిపల్ కార్పొరేషన్, గ్రామ పంచాయతీ సభ్యులకు ఖరీదైన కానుకలు అందించడంతో మంత్రి ఆనంద్ సింగ్ తీవ్ర విమర్శులు ఎదుర్కొంటున్నారు.