స్థిరంగా బంగారం, వెండి.. నేడు మార్కెట్లో ధరలు ఇవే..!
నూతన సంవత్సరం వేళ కొనుగోలుదారులకు బంగారం, వెండి ధరలు కొనుగోలుదారులకు ఊరటనిస్తున్నాయి. వరుసగా రెండోరోజు బులియన్ మార్కెట్లో ధరలు నిలకడగా కొనసాగుతున్నాయి

Gold Rates | నూతన సంవత్సరం వేళ కొనుగోలుదారులకు బంగారం, వెండి ధరలు కొనుగోలుదారులకు ఊరటనిస్తున్నాయి. వరుసగా రెండోరోజు బులియన్ మార్కెట్లో ధరలు నిలకడగా కొనసాగుతున్నాయి. సోమవారం 22 క్యారెట్ల గోల్డ్ తులం రూ.58,550 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి తులానికి రూ.63,870 వద్ద స్థిరంగా కొనసాగుతున్నది. ఇక దేశంలోని వివిధ నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. ఢిల్లీలో 22 క్యారెట్ల గోల్డ్ రూ.57,700 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.63,970 వద్ద నిలకడగా ఉన్నది.
చెన్నైలో 22 క్యారెట్ల స్వర్ణం రూ.59,100 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.64,470 వద్ద ట్రేడవుతున్నది. ముంబయిలో 22 క్యారెట్ల బంగారం రూ.58,550 ఉండగా.. 24 క్యారెట్ల స్వర్ణం రూ.63,870 వద్ద నిలకడగా ఉన్నది. హైదరాబాద్లో 22 క్యారెట్ల బంగారం రూ.58,550 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి రూ.63,870 పలుకుతున్నది. ఏపీలోని విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం నగరాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. మరో వైపు వెండి నిలకడగా ఉన్నది. కిలో ధర రూ.78,600 ఉండగా.. హైదరాబాద్లో కిలో వెండి ధర రూ.80వేలు పలుకుతున్నది.