Telangana | 61 ఏండ్లు దాటితే వారసులకు ఉద్యోగం విధాత: అసెంబ్లీ ఎన్నికల వేళ కేసీఆర్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. వీఆర్ఏల సమస్యలను పరిష్కరించే దిశగా ముందడుగు వేసింది. రాష్ట్రంలో ఉన్న వీఆర్ఏలను నాలుగు శాఖల్లో సర్దుబాటు చేయాలని నిర్ణయించింది ప్రభుత్వం. వీఆర్ఏల విద్యార్హతలను బట్టి.. నీటిపారుదల శాఖ, పురపాలక శాఖ, పంచాయతీరాజ్ శాఖ, మిషన్ భగీరథ శాఖలో సర్దుబాటు చేయనున్నారు. 61 ఏండ్లు దాటిన వీఆర్ఏల ఉద్యోగాన్ని వారి వారసులకు ఇవ్వాలని కేసీఆర్ ప్రభుత్వం […]
Telangana |
విధాత: అసెంబ్లీ ఎన్నికల వేళ కేసీఆర్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. వీఆర్ఏల సమస్యలను పరిష్కరించే దిశగా ముందడుగు వేసింది. రాష్ట్రంలో ఉన్న వీఆర్ఏలను నాలుగు శాఖల్లో సర్దుబాటు చేయాలని నిర్ణయించింది ప్రభుత్వం. వీఆర్ఏల విద్యార్హతలను బట్టి.. నీటిపారుదల శాఖ, పురపాలక శాఖ, పంచాయతీరాజ్ శాఖ, మిషన్ భగీరథ శాఖలో సర్దుబాటు చేయనున్నారు.
61 ఏండ్లు దాటిన వీఆర్ఏల ఉద్యోగాన్ని వారి వారసులకు ఇవ్వాలని కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన ఉత్తర్వులు రేపు విడుదల అయ్యే అవకాశం ఉంది. వీఆర్ఏల సమస్యల పరిష్కారంపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం సాయంత్రం సచివాలయంలో సమావేశమై సుదీర్ఘంగా చర్చించారు.
ఈ సమావేశంలో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి, ఎమ్మెల్యేలు బాల్క సుమన్, ఏ జీవన్ రెడ్డి, కృష్ణ మోహన్ రెడ్డి, మర్రి జనార్ధన్ రెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ముఖ్యమంత్రి సలహాదారు సోమేష్ కుమార్, సీఎస్ శాంతి కుమారి, సీఎంఓ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్ నర్సింగ రావు, ఫైనాన్స్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణా రావు, రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్, స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎంఏయూడీ అరవింద్ కుమార్, సీఎం సెక్రటరీ స్మితా సభర్వాల్, దాసోజు శ్రవణ్, వీఆర్ఏ జేఏసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.