TCA: టొరంటోలో ఘనంగా ఉగాది వేడుకలు

తెలంగాణ కెనడా అసోసియేషన్ ఆధ్వర్యంలో వైభవంగా ఉత్సవాలు విధాత‌: టొరంటోలో అంగరంగ వైభవంగా శ్రీ శోభ కృత్ నామ సంవత్సర ఉగాది 2023 ఉత్సవాలు జ‌రిగాయి. తెలంగాణ కెనడా సంఘం (TCA) ఆధ్వర్యంలో 25th మార్చ్ 2023 శనివారం రోజున కెనడాలోని గ్రేటర్ టొరంటో నగరంలో తెలంగాణ వాసులు ఉగాది పండుగ సాంస్కృతిక ఉత్సవాలు ఎస్‌వీబీఎఫ్‌ (శృంగేరి విద్యా భారతి ఫౌండేషన్) ఆడిటోరియంలో అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. ఈ సంబురాలలో దాదాపు 800 పైగా తెలంగాణ వాసులు […]

  • By: Somu |    latest |    Published on : Mar 28, 2023 12:58 PM IST
TCA: టొరంటోలో ఘనంగా ఉగాది వేడుకలు

తెలంగాణ కెనడా అసోసియేషన్ ఆధ్వర్యంలో వైభవంగా ఉత్సవాలు

విధాత‌: టొరంటోలో అంగరంగ వైభవంగా శ్రీ శోభ కృత్ నామ సంవత్సర ఉగాది 2023 ఉత్సవాలు జ‌రిగాయి. తెలంగాణ కెనడా సంఘం (TCA) ఆధ్వర్యంలో 25th మార్చ్ 2023 శనివారం రోజున కెనడాలోని గ్రేటర్ టొరంటో నగరంలో తెలంగాణ వాసులు ఉగాది పండుగ సాంస్కృతిక ఉత్సవాలు ఎస్‌వీబీఎఫ్‌ (శృంగేరి విద్యా భారతి ఫౌండేషన్) ఆడిటోరియంలో అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. ఈ సంబురాలలో దాదాపు 800 పైగా తెలంగాణ వాసులు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమానికి కాన్సుల్ జనరల్ శ్రీమతి అపూర్వ శ్రీవాస్తవ, కౌన్సిలేట్ జనరల్ ఆఫ్ ఇండియా, టొరంటో ముఖ్యఅతిథిగా విచ్చేశారు. శ్రీమతి మాధురి చాతరాజు, శ్రీమతి మంజు ఆకుల, శ్రీమతి సుజల బూత్కూరి, శ్రీమతి అపర్ణ భరద్వాజ్ పోపూరి, శ్రీమతి రాధిక బెజ్జంకి, జ్యోతి ప్రజ్వలన చేయగా శ్రీమతి గుప్తేశ్వరి వాసుపిల్లి గణేష వందనంతో ఉగాది 2023 సంబురాలను ప్రారంభించారు.

తెలంగాణ కెనడా సంఘం మొట్టమొదటిసారిగా వారి అధికారిక తెలుగు పత్రిక మొదటి ‘TCA ఉగాది’ సంచికను విడుదల చేశారు. దీనిని శ్రీమతి అపూర్వ శ్రీవాస్తవ ఆవిష్కరించి పాలకమండలి సభ్యులకు అందజేశారు.

ఈ సందర్భంగా శ్రీమతి అపూర్వ శ్రీవాస్తవ మాట్లాడుతూ మాతృభాషను ప్రోత్సహిస్తున్న తెలంగాణ కెనడా సంఘం వారికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. అనంతరం సంచికలో పాల్గొన్న వారికి ధృవీకరణ పత్రాలు కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా తరపున అందజేస్తామని తెలిపారు.

కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా కూడా మాతృభాషలని ప్రోత్సహించుట కోసం వివిధ కార్యక్రమాలను చేపడుతున్నట్టుగా ఈ సందర్భంగా తెలిపారు. తెలంగాణ కెనడా సంఘం అధ్యక్షులు శ్రీనివాస్ మన్నెం మాట్లాడుతూ ఈ సంచిక ప్రారంభించడానికి గల ముఖ్య ఉద్దేశం మన మాతృభాష యొక్క ప్రాముఖ్యత ఈ తరం నుంచి భావితరాలకు అందజేయటం అని తెలిపారు.

ఈ కార్యక్రమంలో తదుపరి ప్రముఖ పూజారి శ్రీ నరసింహ చారి శ్రోతలకు పంచాంగ శ్రవణం చేశారు. ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతలుగా కుమారి ధాత్రి అంబటి, శ్రీమతి స్ఫూర్తి కొప్పు వ్యవహరించారు. ఈ సందర్భంగా నిర్వహించినసాంస్కృతిక కార్యక్రమాలకు అనూహ్యమైన స్పందన లభించింది.

పలువురు పెద్దలు మరియు చిన్నారులు సాంస్కృతిక ఉత్సవాల్లో పాల్గొని వారి ప్రతిభను చాటారు. మొత్తం 92 మంది 17 వినూత్నమైన ప్రదర్శనలతో మూడు గంటల పాటు ప్రేక్షకులను అలరింపజేశారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన వారందరికీ ఉగాది పచ్చడి మరియు భక్షాలతో కూడిన రుచికరమైన విందు భోజనం ఏర్పాటు చేశారు.

కార్యక్రమంలో కార్యనిర్వాహక మండలి అధ్యక్షుడు శ్రీనివాస్ మన్నెం, కార్యదర్శి శంతన్ నారెళ్ళపల్లి, సంయుక్త కార్యదర్శి రాజేష్ అర్ర, సాంస్కృతిక కార్యదర్శి దీపా గజవాడ, కోశాధికారి వేణుగోపాల్ ఏళ్ళ, సంయుక్త కోశాధికారి రాహుల్ బాలనేని, డైరెక్టర్లు నాగేశ్వరరావు దలువాయి, ప్రవీణ్ కుమార్ శ్యామల, ప్రణీత్ పాలడుగు, శంకర్ భరద్వాజ పోపూరి, భగీరథ దాస్ అర్గుల మరియు యూత్ డైరెక్టర్ కుమారి ధాత్రి అంబటి, ధర్మకర్తల మండలి చైర్మన్ నవీన్ ఆకుల, బోర్డ్ ఆఫ్ ట్రస్ట్ సభ్యులు ప్రసన్న మేకల.

మాధురి చాతరాజు, వ్యవస్థాపక సభ్యులు దేవేందర్ రెడ్డి గుజ్జుల, ప్రకాష్ చిట్యాల, అఖిలేష్ బెజ్జంకి, ప్రభాకర్ కంబాలపల్లి, శ్రీనివాస తిరునగరి, హరి రాహుల్, సంతోష్ గజవాడ, విజయ్ కుమార్ తిరుమలపురం మరియు పలువురు సంస్థ శ్రేయోభిలాషులు పాల్గొని విజయవంతంగా నిర్వహించారు. సంయుక్త కార్యదర్శి రాజేష్ అర్ర కృతజ్ఞతా వందన సమర్పణతో వేడుకలు ఘనంగా ముగిశాయి.