Dharmapuri: స్ట్రాంగ్‌రూం సీల్‌ పగులగొట్టి తెరిచేందుకు హైకోర్టు అనుమతి

విధాత: ధర్మపురిలో మంత్రి కొప్పుల ఈశ్వర్‌ ఎన్నిక వివాదంపై హైకోర్టులో విచారణ జరిగింది. స్ట్రాంగ్‌రూం సీల్‌ పగులగొట్టి తెరిచేందుకు కలెక్టర్‌కు హైకోర్టు అనుమతి ఇచ్చింది. అయితే అన్ని పార్టీల సమక్షంలో స్ట్రాంగ్‌ రూం తెరవాలని, రిటర్నింగ్‌ అధికారి కోరితే వాహనం, భద్రత ఇవ్వాలని కలెక్టర్‌ను కోర్టు ఆదేశించింది. అవసరమైతే వడ్రంగి, లాక్‌ స్మిత్‌ సహకారం తీసుకోవడానికి అనుమతిచ్చింది. ఆర్‌వోకు డాక్యుమెంట్లు, సీసీ ఫుటేజ్‌ ఇవ్వాలని ఇటీవల హైకోర్టు ఆదేశించింది. తాళం చెవి సరిపోక స్ట్రాంగ్‌ రూం తెరవ […]

  • Publish Date - April 19, 2023 / 02:46 PM IST

విధాత: ధర్మపురిలో మంత్రి కొప్పుల ఈశ్వర్‌ ఎన్నిక వివాదంపై హైకోర్టులో విచారణ జరిగింది. స్ట్రాంగ్‌రూం సీల్‌ పగులగొట్టి తెరిచేందుకు కలెక్టర్‌కు హైకోర్టు అనుమతి ఇచ్చింది. అయితే అన్ని పార్టీల సమక్షంలో స్ట్రాంగ్‌ రూం తెరవాలని, రిటర్నింగ్‌ అధికారి కోరితే వాహనం, భద్రత ఇవ్వాలని కలెక్టర్‌ను కోర్టు ఆదేశించింది.

అవసరమైతే వడ్రంగి, లాక్‌ స్మిత్‌ సహకారం తీసుకోవడానికి అనుమతిచ్చింది. ఆర్‌వోకు డాక్యుమెంట్లు, సీసీ ఫుటేజ్‌ ఇవ్వాలని ఇటీవల హైకోర్టు ఆదేశించింది. తాళం చెవి సరిపోక స్ట్రాంగ్‌ రూం తెరవ లేకపోయినట్టు కలెక్టర్‌ కోర్టుకు తెలిపారు.

తాళాల గల్లంతుపై విచారణ జరిపిస్తున్నామని ఎన్నికల సంఘం చెప్పింది. తదుపరి విచారణను హైకోర్టు ఈ నెల 24 వ తేదీకి వాయిదా వేసింది.

Latest News