Manish Sisodia | ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు కేంద్రం షాక్..!
Manish Sisodia | ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఇప్పటికే లిక్కర్ స్కామ్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఫీడ్ బ్యాక్ యూనిట్ (ఎఫ్బీయూ)కు సంబంధించి స్నూపింగ్ కేసులో సిసోడియాను విచారించేందుకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సీబీఐకి అనుమతి ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వానికి చెందిన ఎఫ్బీయూ ముసుగులో సిసోడియా రాజకీయ గూఢచర్యానికి పాల్పడ్డారని సీబీఐ సిసోడియాపై కేసు నమోదు చేసింది. విచారణ అనుమతి కోసం సీబీఐ […]

Manish Sisodia | ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఇప్పటికే లిక్కర్ స్కామ్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఫీడ్ బ్యాక్ యూనిట్ (ఎఫ్బీయూ)కు సంబంధించి స్నూపింగ్ కేసులో సిసోడియాను విచారించేందుకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సీబీఐకి అనుమతి ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వానికి చెందిన ఎఫ్బీయూ ముసుగులో సిసోడియా రాజకీయ గూఢచర్యానికి పాల్పడ్డారని సీబీఐ సిసోడియాపై కేసు నమోదు చేసింది. విచారణ అనుమతి కోసం సీబీఐ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాను కోరింది.
దాంతో లెఫ్టినెంట్ గవర్నర్ రాష్ట్రపతితో పాటు కేంద్రానికి లేఖ రాసి.. ఈ కేసులో తదుపరి చర్యలు తీసుకునేలా ఆదేశాలివ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మంత్రిత్వ శాఖ ఈ కేసులో విచారించేందుకు అనుమతించింది. దాంతో ఎఫ్బీయూ స్నూపింగ్ కేసులోనూ సిసోడియా సీబీఐ విచారణను ఎదుర్కోవాల్సి రానున్నది. కేజ్రీవాల్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2016లో ఎఫ్బీయూ ఏర్పాటు చేసింది. ఇందుకు రూ.కోటి నిధులు కేటాయించింది. ప్రభుత్వ అధికారులు, సంస్థలు ఎలా పని చేస్తున్నాయో నిఘా వేసి, సంబంధిత సమాచారాన్ని ప్రభుత్వానికి తెలుపుడం ఈ సంస్థ పని. దాంతో ప్రభుత్వ శాఖల పనితీరు మెరుగవుతుందని ఆమ్ ఆద్మీ తెలిపింది. అయితే, ఎఫ్బీయూను ఆప్ తమ రాజకీయ అవసరాల కోసం, రాజకీయ నేతలపై నిఘా పెట్టేందుకు వాడుకుందని సీబీఐ ఆరోపిస్తున్నది. ఇందు కోసం కేటాయించిన నిధులు సైతం దుర్వినియోగమయ్యాయని ఆరోపించగా.. సీబీఐ విచారణ చేపట్టనున్నది.