విధాత: తెలంగాణ ప్రభుత్వం మరో మూడు కొత్త మండలాలను ఏర్పాటు చేస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. పదిహేను రోజుల పాటు అభ్యంతరాలను స్వీకరించి తుది నోటిపిషన్ జారీ చేయనుంది.
నిర్మల జిల్లాలోే మాలేగావ్ మండలాన్ని సన్వాలి, వాయి, లింగి, సౌనా, హంపోలి(బి), మోలా, అంతర్ని, పంగ్రా, గొడ్సెర, సొనారి, నిఘ్వా, మాలేగావ్, గోదాపూర్, కుప్టి, వర్నిలతో కూడిన 15గ్రామాలతో ప్రతిపాదించింది.
బెల్డారోడా మండలాన్ని 12గ్రామాలు ఝరి (కే), వాజ్హరి, బోల్తారోడా, భోసి, మహాలింగి, బమిని, బండోరత్, బోస్లా, ఝరి (బుజుర్గ్), ఉమ్రీ (ఖుర్ద్), బోరేగావ్ (ఖుర్ద్), బెంబెర గ్రామాలను కలుపుతూ మండలంగా ప్రతిపాదించింది.
వనపర్తి జిల్లాలో ఎదులా మండలాన్ని ఎనిమిది గ్రామాలతో ప్రతిపాదించింది. ఇందులో చిన్నారం, చీరకపల్లి, ఏదుల, సింగాయిపల్లి, తుర్కదిన్నె, మాచుపల్లి, ముత్తిరెడ్డిపల్లి, రేకుపల్లి గ్రామాలను కలుపుతూ కొత్త మండలంగా ప్రతిపాదించింది.