IPAC | ABN ఆంధ్రజ్యోతిపై ఐప్యాక్‌ గుస్సా.. తాము సర్వే చేయలేదని వెల్లడి!

IPAC | విధాత‌: ఐప్యాక్‌కు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి మీద ఎక్కడలేని కోపం వచ్చింది. తాము చేశామన్నట్లుగా  ఒక నకిలీ సర్వేను ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో ప్రసారం చేయడాన్ని ఐప్యాక్‌ ఖండించింది. వాస్తవానికి ఐప్యాక్‌ గత కొన్నేళ్లుగా జగన్‌కు రాజకీయ వ్యూహాలు.. ఎత్తులపై ఎత్తులు వేసే విషయంలో సలహాలు ఇస్తున్న సంగతి తెలిసిందే. గత 2019 ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ సారథ్యంలోని బృందం జగన్ తరఫున ప్రచారం.. బ్రాండింగ్ వంటి పనులు చేపట్టి జగన్ను జనం దరికి చేర్చడంలో సక్సెస్ […]

IPAC | ABN ఆంధ్రజ్యోతిపై ఐప్యాక్‌ గుస్సా.. తాము సర్వే చేయలేదని వెల్లడి!

IPAC |

విధాత‌: ఐప్యాక్‌కు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి మీద ఎక్కడలేని కోపం వచ్చింది. తాము చేశామన్నట్లుగా ఒక నకిలీ సర్వేను ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో ప్రసారం చేయడాన్ని ఐప్యాక్‌ ఖండించింది. వాస్తవానికి ఐప్యాక్‌ గత కొన్నేళ్లుగా జగన్‌కు రాజకీయ వ్యూహాలు.. ఎత్తులపై ఎత్తులు వేసే విషయంలో సలహాలు ఇస్తున్న సంగతి తెలిసిందే. గత 2019 ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ సారథ్యంలోని బృందం జగన్ తరఫున ప్రచారం.. బ్రాండింగ్ వంటి పనులు చేపట్టి జగన్ను జనం దరికి చేర్చడంలో సక్సెస్ అయింది.

ఈసారి కూడా ఈ ఐప్యాక్‌ వాళ్ళిచ్చే, సర్వేలు.. అభ్యర్థుల పనితీరు నివేదికల ఆధారంగానే జగన్‌ ప్రభుత్వ నిర్ణయాలు తీసుకోవడం, పార్టీ తరఫున కొత్త కార్యక్రమాలు నిర్వహించడం వంటివి చేస్తున్నారని అంటున్నారు. ఐప్యాక్‌ చెప్పిన ప్రాంతాల్లో రోడ్లు వేయడం కూడా జరుగుతోందని అంటున్నారు.

అయితే తాజాగా ఐప్యాక్‌ ఒక సర్వే నిర్వహించిందని.. అందులో వైసీపీకి ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నట్టు తేలిందని పేర్కొంటూ ఒక టీవీ చానెల్‌ పేర్కొనడాన్ని ఐప్యాక్‌ ఖండించింది. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి అనే ఛానెల్ పేరు ప్రస్తావించకుండానే ఐప్యాక్ ఒక ట్వీట్ చేసింది.

ఇందులో తాము ఎన్నికల కోసం ఎలాంటి సర్వే చేపట్టలేదని పేర్కొంది. కాగా ఐప్యాక్‌ చేసిన సర్వేలో వైసీపీకి ఎదురుదెబ్బ తప్పదని ఆ చానెల్‌ ట్వీట్‌ చేసింది. ఈ ట్వీటును ఐప్యాక్‌ అధికారిక హ్యాండిల్‌కు కూడా ట్యాగ్‌ చేసింది. ఈ నేపథ్యంలో ఐప్యాక్‌ స్పందించింది. తామెలాంటి సర్వేలు నిర్వహించ లేదని వెల్లడించింది.

ఈమేరకు ఆ చానెల్‌ కథనాన్ని ఖండించింది. “ఐప్యాక్‌ ఎటువంటి సర్వేలను నిర్వహించలేదు. మీడియా/సోషల్‌ మీడియా ప్లాట్‌పారమ్‌లలో మాకు ఆపాదించబడిన సర్వే ఏదైనా అది పూర్తిగా అవాస్తవం, అబద్దం. ఈ సర్వే వార్తలు నిరాధారం. తమ ప్రయోజనాల కోసం కొంతమంది వ్యక్తులు, గ్రూపులు ఇలాంటి తప్పుడు ప్రయత్నాలు చేస్తున్నారు” అని ఐప్యాక్‌ ట్వీట్‌ చేసింది.

ఈ ఐప్యాక్‌ చేసినట్లుగా సదరు ఛానెల్ చెబుతున్న సర్వేలో.. ‘కడప, రాజంపేట, అరకు.. ఈ మూడు ఎంపీ స్థానాల్లో మాత్రమే వైసీపీ కచ్చితంగా విజయం సాధిస్తుంది. టీడీపీ 15 లోక్‌సభ స్థానాల్లో విజయం సాధిస్తుంది. మరో ఏడు లోక్‌సభ స్థానాల్లో గట్టి పోటీ ఉంటుంది.

గోదావరి జిల్లాలు, ఉత్తరాంధ్రలోని కొన్ని ప్రాంతాల్లో టీడీపీకి ఆధిక్యత ఉంది”. ఈ నేపథ్యంలో వైసీపీకి గరిష్టంగా 35-50 అసెంబ్లీ సీట్లు వస్తాయని, టీడీపీకి 100కు పైగా సీట్లు వస్తాయని ఐప్యాక్‌ సర్వే పేర్కొన్నట్టు ఆ చానెల్‌ పేర్కొంది. టీడీపీ–జనసేన పొత్తు కుదిరితే కూటమిదే విజయమని ఐప్యాక్‌ వెల్లడించినట్టు కూడా ఆ చానెల్‌ తెలిపింది.