Aditya-L1 | చంద్రయాన్-3 విజయవంతంతో జోరుమీదున్న భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ మరో ప్రతిష్టాత్మక ప్రయోగానికి రంగం సిద్ధం చేసింది. ఆదిత్య ఎల్-1 మిషన్ మరికొద్ది గంటల్లో నింగిలోకి దూసుకెళ్లనున్నది. ఇందు కోసం శ్రీహరికోటలో ఉన్న సతీశ్ ధావన్ స్పేస్ స్టేషన్లో శుక్రవారం కౌంట్డౌన్ ప్రారంభించింది. 23 గంటలకు పైగా ఈ ప్రక్రియ కొనసాగనున్నది. ఉదయం 11.50 గంటలకు ఆదిత్య ఎల్-1 శాటిలైట్ను పీఎస్ఎల్వీ సీ-57 నింగిలోకి మోసుకెళ్లనున్నది. అయితే, ఇస్రో సూర్యుడిపై చేపడుతున్న తొలి మిషన్ […]
Aditya-L1 |
చంద్రయాన్-3 విజయవంతంతో జోరుమీదున్న భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ మరో ప్రతిష్టాత్మక ప్రయోగానికి రంగం సిద్ధం చేసింది. ఆదిత్య ఎల్-1 మిషన్ మరికొద్ది గంటల్లో నింగిలోకి దూసుకెళ్లనున్నది. ఇందు కోసం శ్రీహరికోటలో ఉన్న సతీశ్ ధావన్ స్పేస్ స్టేషన్లో శుక్రవారం కౌంట్డౌన్ ప్రారంభించింది.
23 గంటలకు పైగా ఈ ప్రక్రియ కొనసాగనున్నది. ఉదయం 11.50 గంటలకు ఆదిత్య ఎల్-1 శాటిలైట్ను పీఎస్ఎల్వీ సీ-57 నింగిలోకి మోసుకెళ్లనున్నది. అయితే, ఇస్రో సూర్యుడిపై చేపడుతున్న తొలి మిషన్ ఇదే. 1500 కిలోల బరువున్న శాటిలైట్ను భూమికి 15లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న లాగ్రాంజ్ పాయింట్ 1 (L1) చుట్టూ ఉన్న కక్ష్యలో ప్రవేశపెట్టనున్నారు.
దీంతో గ్రహణాలతో సంబంధం లేకుండా సూర్యుడిపై నిరంతరం ఇస్రో అధ్యయనం చేయనున్నది. మిషన్ ఆదిత్య ఎల్-1లో ఏడు పేలోడ్లను మోసుకెళ్లనుంది. విజిబుల్ ఎమిషన్ లైన్ కొరోనాగ్రాఫ్ (VELC)తో పాటు సోలార్ అల్ట్రావైలెట్ ఇమేజింగ్ టెలిస్కోప్, ఆదిత్య సోలార్ విండ్ పార్టికల్ ఎక్స్పెరిమెంట్, ప్లాస్మా అనలైజర్ ప్యాకేజ్ ఫర్ ఆదిత్య, సోలార్లో ఎనర్జీ ఎక్స్రే స్పెక్ట్రోమీటర్, హైఎనర్జీ ఎల్-1 ఆర్బిటింగ్ ఎక్స్రే స్పెక్ట్రోమీటర్, మాగ్నెటోమీటర్ పేలోడ్ను అమర్చారు.
సూర్యుడి నుంచి వెలువడే శక్తిమంతమైన కాంతిపై ఈ పేలోడ్స్తో అధ్యయనం చేయనున్నారు. పేలోడ్స్ ఎలక్ట్రోమాగ్నెటిక్, మాగ్నెటిక్ ఫీల్డ్ డిటెక్టర్ల సాయంతో సూర్యుడిలోని పొరలైన ఫొటోస్పియర్, క్రోమో స్పియర్, వెలుపల ఉండే కరోనాపై అధ్యయనం చేయనున్నారు. నేడు నింగిలోకి దూసుకెళ్లనున్న శాటిలైట్ను కక్ష్యలో ప్రవేశపెట్టేందుకు సుమారు 125 రోజులు పట్టనున్నది.