రాష్ట్ర మహిళా సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ వరంగల్ గడ్డపై ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: స్త్రీ లేకపోతే సృష్టిలో జీవం లేదు సమాజంలో ప్రగతి లేదని రాష్ట్ర మహిళా సంక్షేమ గిరిజన సంక్షేమ మంత్రి సత్యవతి రాథోడ్ (Minister Satyavathi Rathod) అన్నారు. చారిత్రాత్మకమైన ఓరుగల్లు గడ్డపై మహిళా దినోత్సవం జరుపుకోవడం అదృష్టమన్నారు. మహిళల హక్కుల కోసం ఉద్యమించి, చాటి చెప్పిన వీర వనితల దినోత్సవం “అంతర్జాతీయ మహిళా […]
విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: స్త్రీ లేకపోతే సృష్టిలో జీవం లేదు సమాజంలో ప్రగతి లేదని రాష్ట్ర మహిళా సంక్షేమ గిరిజన సంక్షేమ మంత్రి సత్యవతి రాథోడ్ (Minister Satyavathi Rathod) అన్నారు. చారిత్రాత్మకమైన ఓరుగల్లు గడ్డపై మహిళా దినోత్సవం జరుపుకోవడం అదృష్టమన్నారు. మహిళల హక్కుల కోసం ఉద్యమించి, చాటి చెప్పిన వీర వనితల దినోత్సవం “అంతర్జాతీయ మహిళా దినోత్సవం’ (International Women’s Day) అని’ ఆమె అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో హనుమకొండలో బుధవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర గిరిజన మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ముఖ్య అతిథిగా పాల్గొనగా రాష్ట్ర గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ప్రభుత్వ చీఫ్ దాస్యం వినయ్ భాస్కర్, మండలి ఉప సభాపతి డాక్టర్ బండ ప్రకాష్, మేయర్ గుండు సుధారాణి తదితరులు పాల్గొన్నారు.
మంత్రి సత్యవతి మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాలలో ముందుకు పోతున్నారన్నారు. దృఢ సంకల్పంతో రాజకీయాలు, విద్య ఉద్యోగ రంగాలలో ముందుకు వస్తున్నా సమాజంలో ఆటుపోట్లను ఎదుర్కొంటున్నందున, మార్పులు రావాలన్నారు. కుటుంబ పోషణతోపాటు సమాజ అభ్యున్నతికి పాటుపడాల్సిన మహిళలను గౌరవించాలన్నారు.
మహిళల కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు
ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన ఆరోగ్య లక్ష్మి ప్రతి జిల్లాలో ఐదు సెంటర్లలో నిర్వహించడం జరుగుతుందని రాష్ట్రంలోని 33 జిల్లాలలో 1200 సెంటర్ల ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందన్నారు.250 కోట్ల రూపాయల న్యూట్రిషన్ కిట్ అందించడం ఒక్కొక్క కిట్టులో 4000 విలువ గల ఆహారపు వస్తువులు ఉంటాయన్నారు, బాలామృతం పేరుతో పేదింటి మహిళలకు పౌష్టిక ఆహారం అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని ఆమె తెలిపారు.
మాతా శిశు మరణాలు గణనీయంగా తగ్గిపోయాయని గతంలో 60 శాతం ఉంటే ప్రస్తుతం 27 శాతానికి తగ్గిపోయిందని, రాష్ట్రంలో 14 లక్షల మందికి కల్యాణ లక్ష్మి 12 లక్షల కోట్లు ఖర్చు చేసిందన్నారు. ప్రభుత్వం 33% రిజర్వేషన్ అమలు చేస్తుందని సమాజంలో సగం ఉన్న మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టిందని ఆమె తెలిపారు.
ఆత్మహత్యలు చేసుకోవద్దు
ప్రీతి ఆత్మహత్య దురదృష్టకరమైన సంఘటనని , విద్యార్థులు ధైర్యంగా సమస్యను ఎదుర్కోవాలి కానీ అధైర్యంతో ఆత్మహత్యలు చేసుకోవద్దని మంత్రి సత్యవతి అన్నారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర మహిళలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. మేయర్ గుండు సుధారాణి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో మహిళల సర్వతో ముక్క అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం విద్య ఉద్యోగ, పారిశ్రామిక రంగాలలో మహిళలకు అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు.
యూనివర్సిటీ వీసీ టి. రమేష్, జిల్లా పరిషత్ చైర్మన్లు డాక్టర్ సుధీర్, బిందు, గండ్ర జ్యోతి, రాష్ట్ర సంగీత అకాడమీ చైర్మన్ దీప్తి రెడ్డి, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ కమీషనర్ భారతి హోలీ కేరిజిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, కమిషనర్ ప్రావీణ్యా, కూడా చైర్మన్ సుందర్రాజు తదితరులు పాల్గొన్నారు
ఆకట్టుకున్న సాంస్కృతిక ప్రదర్శనలు
రాష్ట్రంలోని వివిధ విభాగాలలో విశేష కృషి చేసిన నిష్టాతులైన 27 మంది మహిళలను మంత్రి రాథోడ్ ఘనంగా సత్కరించారు. రూ.లక్ష నగదు ప్రశంసా పత్రం అందజేశారు. విశ్వవిద్యాలయం అధ్యాపకులు విద్యార్థిని, విద్యార్థులు భారీ సంఖ్య లో పాల్గొన్నారు . సంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా అలరించాయి.