• Telugu News
  • /Latest

Joe Biden | సెప్టెంబర్‌లో భారత్‌కు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌..

Joe Biden | అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ త్వరలో భారత్‌లో పర్యటించనున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఆయన భారత్‌కు వచ్చే అవకాశాలున్నాయి. అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన భారత్‌లో పర్యటించడం ఇదే తొలిసారి. సెప్టెంబర్‌లో భారత పర్యటన కోసం బైడెన్‌(Joe Biden) ఎదురు చూస్తున్నారని దక్షిణ మధ్య ఆసియా సహాయ కార్యదర్శి డోనాల్డ్‌ లూ తెలిపారు. భారత్‌ - అమెరికా సంబంధాలకు 2024 కీలకం కాబోతుందని ఆయన పేర్కొన్నారు. జీ-20 భారత్‌ బాగా […]

Reported by: Vineela | latest | IST
Read Time: 3 mins

Joe Biden |

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ త్వరలో భారత్‌లో పర్యటించనున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఆయన భారత్‌కు వచ్చే అవకాశాలున్నాయి. అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన భారత్‌లో పర్యటించడం ఇదే తొలిసారి. సెప్టెంబర్‌లో భారత పర్యటన కోసం బైడెన్‌(Joe Biden) ఎదురు చూస్తున్నారని దక్షిణ మధ్య ఆసియా సహాయ కార్యదర్శి డోనాల్డ్‌ లూ తెలిపారు.

భారత్‌ – అమెరికా సంబంధాలకు 2024 కీలకం కాబోతుందని ఆయన పేర్కొన్నారు. జీ-20 భారత్‌ బాగా ఆతిథ్యం ఇస్తోందని, క్వాడ్‌ సభ్యులు చాలా మంది నాయకత్వ పాత్ర పోషిస్తున్నారని, ఇది మనల్ని మరింత దగ్గర చేసే అవకాశాన్ని కల్పిస్తుందని అని పేర్కొన్నారు.

వాతావరణ మార్పుపై ప్రతిష్టాత్మక లక్ష్యాలు సాధించడానికి భారతదేశం, ఇతర దేశాలతో కలిసి పని చేయాలని సంకల్పిస్తూ.. ఈ సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో ప్రపంచ విజయం కొంత వరకు భారతదేశం తీసుకునే నిర్ణయాలపై ఆధారపడి ఉంటుందని డొనాల్డ్ లూ అభిప్రాయపడ్డారు.

ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంలో ప్రజాస్వామ్యానికి మద్దతు ఇవ్వడంలో పాత్రికేయులు కీలక పాత్ర పోషించారని, భారతదేశంలో ఏదీ రహస్యంగా ఉండదని, భారతదేశం ప్రజాస్వామ్య దేశంగా ఉందన్నారు. ఎందుకంటే స్వేచ్ఛా పని చేసే మీడియా ఉందని పేర్కొన్నారు.

అలాగే ఈ నెల చివరి నాటికి భారత్‌కు అమెరికా నూతన రాయబారి ఎరిక్ గార్సెట్ట్ రానున్నారని ఆయన పేర్కొన్నారు. అమెరికా ఎంబసీలోని భారతీయ అమెరికన్ సిబ్బంది నుంచి అతనికి ఇప్పటికే నిజంగా ఘన స్వాగతం లభించిందని, తన వివరాలను సమర్పించిన తర్వాత భారత్‌లోని మిగిలిన వారితో కలవడానికి ఎదురుచూస్తున్నారు అని పేర్కొన్నారు.