బీఆర్ఎస్ శాసనసభా పక్ష నేతగా కేసీఆర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కేసీఆర్ను శాసనసభా పక్ష నేతగా ప్రతిపాదిస్తూ మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి తీర్మానం చేశారు
హైదరాబాద్: బీఆర్ఎస్ శాసనసభా పక్ష నేతగా ఆ పార్టీ అధినేత కేసీఆర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కేసీఆర్ను శాసనసభా పక్ష నేతగా ప్రతిపాదిస్తూ మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి తీర్మానం చేశారు. ఈ తీర్మానాన్ని మాజీ మంత్రులు కడియం శ్రీహరి, తలసాని శ్రీనివాస్ యాదవ్ బలపరిచారు.
ఈ ఉదయం 9 గంటలకు తెలంగాణ భవన్లో సమావేశమైన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ఎల్పీ ఎన్నికపై చర్చించారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధ్యక్షతన ఎన్నికైన ఈ సమావేశానికి 39 మంది ఎమ్మెల్యేలు హాజరయ్యారు. 1985లో కేసీఆర్ తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1989, 1994, 1999, 2001, 2004, 2009, 2014, 2018, 2023 ఎన్నికల్లోనూ కేసీఆర్ ఎమ్మెల్యేగా గెలుపొందారు.