Khammam రేపు ఖమ్మంలో కాంగ్రెస్ తెలంగాణ జన గర్జన సభ హాజరుకానున్న రాహుల్ గాంధీ విధాత: సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ముగింపుతో పాటు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సహా పలువురు కాంగ్రెస్ లో చేరికల సందర్భంగా రేపు ఖమ్మంలో నిర్వహించనున్న తెలంగాణ జనగర్జన బహిరంగ సభకు రాహుల్ గాంధీ హాజరుకానున్న నేపథ్యంలో సభ విజయవంతం కోసం పార్టీ భారీ ఏర్పాట్లు చేసింది. ఖమ్మం సభకు రాహుల్ గాంధీతో పాటు […]
Khammam
విధాత: సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ముగింపుతో పాటు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సహా పలువురు కాంగ్రెస్ లో చేరికల సందర్భంగా రేపు ఖమ్మంలో నిర్వహించనున్న తెలంగాణ జనగర్జన బహిరంగ సభకు రాహుల్ గాంధీ హాజరుకానున్న నేపథ్యంలో సభ విజయవంతం కోసం పార్టీ భారీ ఏర్పాట్లు చేసింది.
ఖమ్మం సభకు రాహుల్ గాంధీతో పాటు పలువురు పార్టీ జాతీయ, రాష్ట్ర ముఖ్య నేతలంతా హాజరవుతున్నారు. 1300 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేసుకున్న భట్టికి సన్మానం, భారీగా చేరికలు ఉన్న నేపథ్యంలో ఖమ్మం సభ విజయవంతం కోసం పొంగులేటితో పాటు రాష్ట్ర పార్టీ నాయకత్వం భారీ జన సమీకరణకు సన్నాహాలు చేసింది. లక్షలాదిమంది ఖమ్మం సభకు హాజరవుతారని కాంగ్రెస్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఖమ్మం సభకు కేసీఆర్ ప్రభుత్వం ఆటంకాలు కల్పిస్తుందంటూ పొంగులేటి ఆరోపిస్తున్నారు. దీనికి బలం చేకూరే రీతిలో సభకు ఒకరోజు ముందు పొంగులేటితోపాటు ఆయన అనుచరులైన మాజీ డిసిసిబి చైర్మన్ మువ్వా విజయబాబులను బెదిరిస్తూ గుర్తుతెలియని వ్యక్తులు వేసిన పోస్టర్లు ఖమ్మం రాజకీయాల్లో హీట్ పెంచాయి.
పువ్వాడ అజయ్ కుమార్ కాళ్లు పట్టుకొని క్షమాపణ అడగకపోతే చీకటి కార్తీక్ కు పట్టిన గతి పడుతుంది అంటూ.. మీ శవాలు కూడా దొరకవు అంటూ తీవ్ర హెచ్చరికలు చేయడం గమనార్హం. ఈ హెచ్చరికలపై పొంగులేటి సైతం ఘాటుగానే స్పందించారు.
నేనేంటో చూపిస్తానని ఎవరెన్ని కుట్రలు చేసినా ఖమ్మం సభ సక్సెస్ చేస్తామన్నారు. తన అనుచరులను అధికార పార్టీ నేతలు పోస్టర్లతో బెదిరించి చిల్లర రాజకీయాలు చేస్తున్నారన్నారు. తాను చెల్లని రూపాయినో బంగారు నాణెమో మూడు నెలల్లో చూపిస్తానన్నారు.