KTR విధాత: పది సార్లు అధికారం ఇస్తే ఏమీ చేయని, చేతగాని దద్దమ్మలు కాంగ్రెస్ నాయకులు. యాభై ఏళ్ళలో 24 గంటల కరెంట్ ఇవ్వలేదని, ఫ్లోరైడ్ సమస్య తీర్చలేదని మంత్రి కేటీఆర్ విమర్శించారు. గురువారం తిరుమలగిరి మున్సిపాలిటీలో 80 కోట్లతో పలు అభివృద్ధి పనులకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపనలు చేశారు. నిర్వహించిన తుంగతుర్తి నియోజకవర్గం ప్రగతి నివేదన సభలో కేటీఆర్ మాట్లాడారు. కాంగ్రెస్ నాయకుల వైఖరి చూస్తే తప్పులు చేసి అనాథ అని తప్పించుకునే ఓ పిల్లాడిలా […]
KTR
విధాత: పది సార్లు అధికారం ఇస్తే ఏమీ చేయని, చేతగాని దద్దమ్మలు కాంగ్రెస్ నాయకులు. యాభై ఏళ్ళలో 24 గంటల కరెంట్ ఇవ్వలేదని, ఫ్లోరైడ్ సమస్య తీర్చలేదని మంత్రి కేటీఆర్ విమర్శించారు. గురువారం తిరుమలగిరి మున్సిపాలిటీలో 80 కోట్లతో పలు అభివృద్ధి పనులకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపనలు చేశారు.
నిర్వహించిన తుంగతుర్తి నియోజకవర్గం ప్రగతి నివేదన సభలో కేటీఆర్ మాట్లాడారు. కాంగ్రెస్ నాయకుల వైఖరి చూస్తే తప్పులు చేసి అనాథ అని తప్పించుకునే ఓ పిల్లాడిలా ఉందంటూ ఎద్దేవా చేశారు. సీఎం కేసీఅర్ ప్రజలను తమ బిడ్డల్లా చూసుకుంటున్నారన్నారు. అందుకే ప్రతిపక్షాలకు అసూయ పుడుతుందన్నారు.
నిబద్ధత, విజన్ ఉన్న కేసీఆర్ వెంటే యావత్ ప్రజలు వున్నారన్నారు. తుంగతుర్తి నియోజకవర్గంలో దళిత బంధు ద్వారా 2300 మందికి నియోజకవర్గంలో ఆర్థిక చేయూత అందించామన్నారు. జిల్లాలో ఫ్లోరైడ్ తో ప్రజలు జీవచ్చవాల్లా మారిపోతే దద్దమ్మ కాంగ్రెస్ నాయకులు ఏం చేయలేక చేతులు ముడుచుకొని కూర్చున్నారనన్నారు.
అలాంటి కాంగ్రెస్ వాళ్ళను ఎలా నమ్మాలని ప్రశ్నించారు. నిన్న మొన్న పాదయాత్ర చేస్తున్న కాంగ్రెస్ నాయకుడు భట్టి విక్రమార్క అడ్డగోలుగా ఆరోపణలు చేస్తున్నాడన్నారు. కాంగ్రెస్ వాళ్లు పచ్చి మోసగాళ్ళని, తెలంగాణ ప్రజలను 50 ఏళ్ళు అరి గోస పెట్టిన నీచులు కాంగ్రెస్ నాయకులన్నారు.
50 ఏళ్ళు తెలంగాణను సర్వనాశనం చేశారన్నారు. కాంగ్రెస్ , బీజేపీ వాళ్ళ మాటలు నమ్మొద్దన్నారు.
ఇవ్వాళ నల్గొండ జిల్లా తెలంగాణకి ధాన్యాగారం అయిందన్నారు. కాంగ్రెస్ నాయకులకు బుద్ధి లేదని, యాక్టింగ్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అని విమర్శలు చేశారు.
ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ కొరినట్లుగా తిరుమలగిరి, మోత్కూర్ మున్సిపాలిటీ లకు మొత్తం 100 కోట్లు విడుదల చేస్తామన్నారు. దళితులు, గిరిజనులు, అన్నదాతలు, అందరూ బిఆర్ఎస్ కు అండగా ఉండాలన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ వాళ్లు ఎన్ని జిమ్మిక్కులు చేసినా గాదరి కిషోర్ కు ఓటేయండన్నారు.
ముచ్చటగా మూడో సారి గాదరి కిషోర్ ను ఎమ్మెల్యేగా 40 వేల మెజార్టీతో గెలిపించాలని, హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా గాదరి కిషోర్ కుమార్ చరిత్ర సృష్టించాలన్నారు. తుంగతుర్తి లో గెలిచేది బిఆర్ఎస్ మాత్రమేనని, నియోజకవర్గంలో ప్రతిపక్షాలు పత్తా లేకుండా పోయాయన్నారు. 3,64,891 ఆయకట్టు ఉన్న తుంగతుర్తి నియోజకవర్గంలో కాళేశ్వరం ప్రాజెక్టు తో లక్షన్నర ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరిగిందన్నారు.
ఒక్క తుంగతుర్తి నియోజకవర్గంలో 49,130 మందికి ఆసరా పెన్షన్ లు ఇస్తున్నామన్నారు. కర్ణాటక నుండి పైసలు పంపినా, ఎక్కడి నుండైనా పైసలు ఇస్తే జేబులో పెట్టుకుని కిషోర్ ను 40 వేల మెజారిటీతో గెలిపించాలన్నారు.
మంత్రి జి. జగదీష్ రెడ్డి మాట్లాడుతూ నాలుగున్నరేళ్లుగా పత్తా లేని వారు, ప్రజల తిరస్కారానికి గురైన వారి నోరు తెగ లేస్తుందని, పాదయాత్రల పేరుతో కొందరు నేతలు డ్రామాలకు తెరలేపారని, స్థాయిని మరిచి కేసీఅర్ పాలనను ప్రశ్నిస్తున్నారన్నారు. అభివృద్ధిపై చర్చకు సిద్ధమా అంటే తోక ముడిచారని, కాంగ్రెస్, బిజెపి నేతలకు సవాల్ చేస్తున్నానన్నారు. అభివృద్ధి పై కేసీఅర్ సీఎం అయ్యాకే తెలంగాణ అభివృద్ధి జరిగిందన్నారు.
సంక్షోభాన్ని పారద్రోలి…. సంక్షేమాన్ని మోసుకొచ్చిన ఘనత మాదన్నారు. దేశానికి దిక్సూచి కేటీఆర్ అని, కేంద్రంలో ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖ మంత్రి కేటీఆరే అని ప్రపంచ దేశాలు భావిస్తున్నాయన్నారు. మహారాష్ట్రలో సీఎం పర్యటన చూశాక దేశం మొత్తం కేసీఅర్ పాలన కావాలని కోరుతుందని స్పష్టమైందన్నారు. పాదయాత్రలలో కాంగ్రెస్ వృద్ధ సింహాలు అవాకులు… చెవాకులు పేలుతున్నారన్నారు.
వరుసగా మూడు సార్లు కృష్ణా, గోదావరి జలాలు తెచ్చి 40 లక్షల మెట్రిక్ టన్నులు పండించి తెచ్చి దేశానికి అన్నపూర్ణగా నల్లగొండ జిల్లా నిలిచిందన్నారు. మీ హయాంలో ఊరికి ఐదు సమాధులు ఇస్తే… మా హయాంలో చేసిన పచ్చటి అభివృద్ధితో రైతులు ప్రశాంతంగా ఉన్నారని కాంగ్రెస్ పాలనపై విమర్శలు గుప్పించారు.
జిల్లా అభివృద్ధిపై గణాంకలతో సహా చర్చకు సిద్ధంగా ఉన్నామని, బిఆర్ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధి నిరూపిస్తే తుంగతుర్తి నుండి ఢిల్లీ దాకా ముక్కు నేలకు రాస్తారా అని జగదీష్ రెడ్డి సవాల్ చేశారు.
ఉమ్మడి నల్గొండ జిల్లా కెసిఆర్ ఖిల్లా…12కు 12 బీఆర్ఎస్ గెలుపు తథ్యమన్నారు.
ఎమ్మెల్యే గాదరి కిషోర్ మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలతో తుంగతుర్తిలో అన్ని వర్గాల ప్రజలు సంతృప్తి తో ఉన్నారన్నారు. సంక్షేమ పథకాలు,అభివుద్దే ఎజెండా గా పనిచేస్తానన్నారు. మూడోసారి కూడా తుంగతుర్తి గడ్డపై గులాబీ జెండా ఎగరడం ఖాయమన్నారు. హ్యాట్రిక్ ముఖ్యమంత్రిగా కేసీఅర్ చరిత్ర సృష్టించబోతున్నారన్నారు.
బీఆర్ఎస్ వచ్చాకే ఫ్యాక్షన్ రాజకీయాలు మారి ప్రశాంతంగా మారాయన్నారు. కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రం అభివృద్ధి ముందుకు సాగుతుందన్నారు. తుంగతుర్తి గడ్డ పై మూడోసారి హాట్రిక్ కోడితేనే మరింత అభివృద్ధి సాధ్యమన్నారు. కాళేశ్వరం నుండి తుంగతుర్తి నియోజకవర్గంలో మొదటగా గోదావరి జలాలు రావడంతో లక్ష 41 వేల ఎకరాలు సాగవుతున్నాయన్నారు.