విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: వ్యవసాయ భూ వివాదంలో నిందితుడికి సహకరించినందుకుగాను గతంలో రఘునాథపల్లి ఎస్సైగా పనిచేసిన ఎన్. వీరేందర్ను సోమవారం వరంగల్ (Warangal) సిటీ రంగనాథ్ సస్పెండ్ చేశారు.
ఈ ఆరోపణపై ఎస్సై వీరేందర్ను ఇప్పటికే పోలీస్ కమిషనరేట్ వీఆర్కు బదిలీ చేయగా తాజాగా సస్పెండ్ చేశారు.
వ్యవసాయ భూ వివాదానికి సంబంధించి అధికారులు నిర్వహించిన విచారణకు ఎస్సై సహకరించక పోవడంతో పాటు ఈ వివాదంలో ఎస్సై నిందితుడికి సహకరించారు.
సంబంధించిన బాధితుల్ని ఇబ్బందులు గురి చేసినందునట్లుగా విచారణలో నిర్ధారణ కావడంతో ఎస్సై వీరేందర్ను సస్పెండ్ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు.