తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) ఆధ్వర్యం లో శివాలయాల సందర్శన యాత్ర

తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్)వారు గత సంవత్సరం తొలి సారి నిర్వహించిన మహా శివరాత్రి శివాలయాల సందర్శన యాత్ర ను ఈ మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా రెండొవ సారి నిర్వహించడం జరిగింది

తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) ఆధ్వర్యం లో శివాలయాల సందర్శన యాత్ర

తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్)వారు గత సంవత్సరం తొలి సారి నిర్వహించిన మహా శివరాత్రి శివాలయాల సందర్శన యాత్ర ను ఈ మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా రెండొవ సారి నిర్వహించడం జరిగింది . ఈ యాత్ర మార్చ్ 8 వ తేదీ రాత్రి రాత్రి 9 గంటల నుండి మార్చ్ 9 వ తేదీ ఉదయం 7 గంటల నిర్వహించారు. ఈ భక్తి యాత్ర లో బాగంగా సింగపూర్ లో ఉన్న10-12 ప్రముఖ శివాలయాలను సందర్శించడం జరిగింది.


ఈ యాత్ర నిర్వహించడానికి సింగపూర్ లోని జురాంగ్ ఈస్ట్-బుకిత్ పంజాంగ్, సెంగ్ కాంగ్ మరియు టాంపనీస్-బెడోక్ ప్రాంతాల నుండి బస్సులను సమకూర్చి యాత్ర ను విజయవంతగా నిర్వహించడం జరిగింది. ఈ దేవాలయాల సందర్శన యాత్రలో భాగంగా వివిధ బస్సుల ద్వారా సుమారు 267 మంది భక్తులు వివిధ దేవాలయాలను సందర్శించి ఆ పరమ శివుని దీవెన లు పొందారు. యాత్రలో పాల్గొన్న భక్తులకు శివ సహస్ర నామముల ఫుస్తకం అందజేయడం జరిగింది. ఈ శివ రాత్రి సందర్బంగా సింగపూర్ లో ఉన్న ప్రముఖ దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. బస్సులో భక్తుల శివనామ స్మరణతో మారుమ్రోగాయి.


ఎవరికీ ఎలాంటి ఇబ్బంది కలగకుండా చక్కని ప్రణాళిక తో సురక్షితంగా యాత్ర ను నిర్వహించిన సొసైటీ వారికి కి ఈ యాత్రలో పాల్గొన్న భక్తులందరూ కృతజ్ఞతలు తెలియజేసి అభినందించారు. ఎలాంటి లాభాపేక్ష మరియు ఆడంబరాలు లేకుండా సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు వివిధ సేవ మరియు భక్తి కార్యక్రమాలు నిర్వహిస్తున్న తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) వారిని ఈ కార్యక్రమం లో పాల్గొన్న భక్తులు కొనియాడారు.

 

ఈ కార్యక్రమానికి సమన్వయ కర్తలుగా సంతోష్ వర్మ మాదారపు, శశిధర్ ఎర్రమరెడ్డి, ఉపాధ్యక్షులు నల్ల భాస్కర్, దుర్గ ప్రసాద్ మరియు గోనె నరేందర్, ఉపాధ్యక్షురాలు సునీత రెడ్డి, ప్రాంతీయ కార్యదర్శి బొందుగుల రాము, భాస్కర్ నడికట్ల మొదలగు వారు ఉన్నారు.


వీరితో పాటు యాత్ర లో సహాయపడిన పెరుకు శివ రామ్ ప్రసాద్, బండారు శ్రీధర్, పి ఎస్ ఎన్ గౌడ్ తో పాటు, శివ సహస్ర నామముల పుస్తకాలు భారత్ నుండి సింగపూర్ కి తీసుకురావడం లో సహాయం చేసిన చల్లా క్రిష్ణ మరియు చికట్ల తిరుపతి తో ఈ పుస్తకాలను స్థానికంగా పంపిణీ చేయడంలో సహాయపడిన నంగునూరి వెంకట రమణ మరియు మణికంఠ రెడ్డి కి కృతజ్ణతలు తెలియజేశారు.

ఈ సందర్భంగా సొసైటీ అధ్యక్షులు గడప రమేష్, ప్రధాన కార్యదర్శి బసిక ప్రశాంత్, కోశాధికారి జూలూరి సంతోష్ కుమార్ గార్లు ఈ యాత్ర ను ఇంత విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు. మరియు గత సంవత్సరం మొదలైన ఈ భక్తి కార్యక్రమానికి భారీ స్పందన వచ్చిందని, సొసైటీ చేస్తున్న వినూత్న కార్యక్రమాలకు సహకారం అందిస్తూ ప్రోత్సహిస్తున్న సభ్యులకు మరియు స్పాన్సర్స్ కి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.