Site icon vidhaatha

Medak | మహిళా కూలీలతో కలిసి వరినాట్లు వేసిన ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి

Medak

విధాత, మెదక్ బ్యూరో: హవేలీ ఘనపూర్ మండలం చౌట్ల పల్లి గ్రామ శివారులో మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి మహిళా కూలీలతో కలిసి వరినాట్లు వేశారు. మండలంలో పర్యటన ముగించుకొని తిరిగి వస్తున్న క్రమంలో రోడ్ ప్రక్కన వర్షంలో మహిళలు వరి నాట్లు వేస్తూ ఎమ్మెల్యేకు కన్పించారు.

వెంటనే తన కారు దిగి మహిళలతో వరినాట్లు వేశారు. మహిళలు పాటలు పాడుతూ నాట్లు వేస్తున్న క్రమంలో మహిళలతో కలిసి పాటకు ఎమ్మెల్యే శ్రుతి కలిపారు. దీంతో మహిళలు సంతోషం వ్యక్తం చేశారు. కొద్దిసేపు మహిళలతో ఎమ్మెల్యే ముచ్చటించారు.

Exit mobile version