Medak | తెలంగాణ 2 కే రన్ విజయవంతం.. పాల్గొన్న MLA పద్మా దేవేందర్ రెడ్డి, కలెక్టర్, SP

Medak విధాత, మెదక్ బ్యూరో: తెలంగాణ రాష్ట్రావతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా సోమవారం యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన మెదక్ తెలంగాణ 2 కె రన్ ఎంతో ఉత్సాహభరితంగా సాగింది. మెదక్ నియోజక వర్గానికి సంబందించి మెదక్ పట్టణంలోని స్థానిక రాందాస్ చౌరస్తా నుండి ఇందిరా గాంధీ అవుట్ డోర్ స్టేడియం వరకు సాగిన ఈ ర్యాలీని మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ రోహిణి ప్రియదర్శిని జెండా […]

  • Publish Date - June 12, 2023 / 10:04 AM IST

Medak

విధాత, మెదక్ బ్యూరో: తెలంగాణ రాష్ట్రావతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా సోమవారం యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన మెదక్ తెలంగాణ 2 కె రన్ ఎంతో ఉత్సాహభరితంగా సాగింది.

మెదక్ నియోజక వర్గానికి సంబందించి మెదక్ పట్టణంలోని స్థానిక రాందాస్ చౌరస్తా నుండి ఇందిరా గాంధీ అవుట్ డోర్ స్టేడియం వరకు సాగిన ఈ ర్యాలీని మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ రోహిణి ప్రియదర్శిని జెండా ఊపి ప్రారంభించారు. రన్ లో పోలీసులు, జిల్లా అధికారులు, సిబ్బంది, యువజన సంఘాలు, యువత, విద్యార్థిని, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

అనంతరం స్టేడియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గాల్లోకి బెలూన్లు ఎగురవేశారు.ఈ సందర్భంగా తెలంగాణ టర్న్స్ 10 భంగిమలో విద్యారులు ప్రదర్శించిన విన్యాసాలు, ఎంతో హుషారుగా ఎమ్మెల్యే, కలెక్టర్, ఎస్పీ లు చేసిన నృత్యాలు అలరించారు.

ఈ కార్యక్రమంలో డిఎస్పీ సైదులు, ఆర్.డి.ఓ. సాయి రామ్, మునిసిపల్ వైస్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్, మునిసిపల్ కమీషనర్ జానకి రామ్ సాగర్, జిల్లా యువజన క్రీడల అధికారి నాగరాజ్, సి.ఐ.లు, ఎస్.ఐ.లు, కానిస్టేబుళ్లు, యువత, విద్యార్థులు, వ్యాయామ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

Latest News