MLC KAVITHA | మహిళా రిజర్వేషన్ కోసం.. 10న ఢిల్లీలో నిరాహార దీక్ష: ఎమ్మెల్సీ కవిత

MLC KAVITHA, Bharat Jagruti విధాత: మహిళా రిజర్వేషన్ సాధన కోసం ఈ నెల 10న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద భారత్ జాగృతి (Bharat Jagruti) ఆధ్వర్యంలో నిరాహార దీక్ష చేపడుతున్నట్లు భార‌త జాగృతి అధ్య‌క్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రకటించారు. గురువారం తన నివాసంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. 2014, 2019 ఎన్నికల మేనిఫెస్టోలో మహిళా రిజర్వేష‌న్ల‌కు సంబంధించిన అంశాన్ని బీజేపీ చేర్చింద‌ని, కానీ అమ‌లు చేయ‌లేద‌న్నారు. ఆ హామీని […]

  • By: krs    latest    Mar 02, 2023 12:04 PM IST
MLC KAVITHA | మహిళా రిజర్వేషన్ కోసం.. 10న ఢిల్లీలో నిరాహార దీక్ష: ఎమ్మెల్సీ కవిత

MLC KAVITHA, Bharat Jagruti

విధాత: మహిళా రిజర్వేషన్ సాధన కోసం ఈ నెల 10న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద భారత్ జాగృతి (Bharat Jagruti) ఆధ్వర్యంలో నిరాహార దీక్ష చేపడుతున్నట్లు భార‌త జాగృతి అధ్య‌క్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రకటించారు. గురువారం తన నివాసంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ..

2014, 2019 ఎన్నికల మేనిఫెస్టోలో మహిళా రిజర్వేష‌న్ల‌కు సంబంధించిన అంశాన్ని బీజేపీ చేర్చింద‌ని, కానీ అమ‌లు చేయ‌లేద‌న్నారు. ఆ హామీని ఇప్పటికైనా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇంకా కేవలం మూడు పార్లమెంటు సమావేశాలు మాత్రమే ఉన్నాయని, కాబట్టి మహిళా రిజర్వేషన్ బిల్లును తీసుకు రావాలని అన్నారు.

తెలంగాణ జాగృతి తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ భావజాల వ్యాప్తి పెంపొందించాలన్న లక్ష్యంతో పని చేసి, నేడు దేశవ్యాప్తంగా కూడా అదే పని చేయాలన్న ఉద్దేశంతో భారత్ జాగృతిగా రూపాంతరం చెందిందని గుర్తు చేశారు. మహిళలకు రిజర్వేషన్ కల్పించాలంటూ భారత్ జాగృతి (Bharat Jagruti) ఆధ్వర్యంలో ఈ నెల 10వ తేదీన జంతర్‌మంతర్ వద్ద ఒక రోజు నిరాహార దీక్ష చేయాలనే నిర్ణయించామని వెల్లడించారు.

మహిళలు రాజకీయ రంగంలో ముందు ఉండాలంటే రిజర్వేషన్ తోనే సాధ్యమవుతుందని భారత్ జాగృతి (Bharat Jagruti) విశ్వసిస్తుందని తెలిపారు. మార్చి 8న హోళీ పండుగ ఉన్నందును మార్చి 10న ఢిల్లీలో దీక్ష చేస్తున్నామని, మార్చి 13 నుంచి ప్రారంభమయ్యే రెండో విడత బడ్జెట్ సమావేశాల్లోనే మహిళ రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించాలని డిమాండ్ చేశారు.

20 ఏళ్ల క్రితం మహిళలకు రిజర్వేషన్లు కల్పించిన దేశాలు 2026 నాటికి లింగ సమానత్వ లక్ష్యాలను చేరుకుంటాయని తెలిపారు. కానీ రిజర్వేషన్ కల్పించని భారత్ వంటి దేశాలు ఆ లక్ష్యాన్ని చేసుకోవాలంటే 2063 వరకు వేచి చూడాల్సిన పరిస్థితి అని చెప్పారు. ఇందులో రాజకీయమేమీ లేదని, సగం జనాభాను ఇంట్లో కూర్చోబెట్టి దేశాన్ని సూపర్ పవర్, విశ్వగురువుగా చేయలేరని విమర్శించారు.

నిరాహార దీక్షకు అన్ని మహిళా సంఘాల ప్రతినిధులను, రాజకీయ పార్టీల నేతలను ఆహ్వానించామని తెలిపారు. రాజకీయ రంగంలో మహిళలు ముందడుగు వేయాలంటే భారత్ లాంటి దేశాల్లో రిజర్వేషన్ ఉంటేనే సాధ్యమవుతుందన్నారు కవిత (MLC KAVITHA) అన్నారు.