Nara Brahmani | నారా బ్రాహ్మణి పేరు అందరికీ సుపరిచితమే. నందమూరి బాలకృష్ణ కూతురిగా.. నారా చంద్రబాబు నాయుడు కోడలిగా బ్రాహ్మణి తెలుగు రాష్ట్రాల ప్రజలకు సుపరిచితం. ప్రస్తుతం హెరిటేజ్ ఫుడ్స్కు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా కొనసాగుతున్న బ్రాహ్మణి.. వ్యాపార రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. ఒక్క వ్యాపార రంగంలోనే కాదు.. తనలో మరో ప్రత్యేక టాలెంట్ ఉందని చాటుకున్నారు బ్రాహ్మణి. హిమాలయాల్లో బైక్ రైడ్ చేస్తూ.. అందరిని ఆశ్చర్చపరిచారు. బ్రాహ్మణి బైక్ రైడ్ వీడియో […]
Nara Brahmani | నారా బ్రాహ్మణి పేరు అందరికీ సుపరిచితమే. నందమూరి బాలకృష్ణ కూతురిగా.. నారా చంద్రబాబు నాయుడు కోడలిగా బ్రాహ్మణి తెలుగు రాష్ట్రాల ప్రజలకు సుపరిచితం. ప్రస్తుతం హెరిటేజ్ ఫుడ్స్కు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా కొనసాగుతున్న బ్రాహ్మణి.. వ్యాపార రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. ఒక్క వ్యాపార రంగంలోనే కాదు.. తనలో మరో ప్రత్యేక టాలెంట్ ఉందని చాటుకున్నారు బ్రాహ్మణి. హిమాలయాల్లో బైక్ రైడ్ చేస్తూ.. అందరిని ఆశ్చర్చపరిచారు. బ్రాహ్మణి బైక్ రైడ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
యువ పారిశ్రామికవేత్తలు, వివిధ సంస్థల సీఈవోలు సభ్యులుగా ఉన్న యంగ్ ప్రెసిడెంట్స్ ఆర్గనైజేషన్(వైపీఓ) ఇటీవల ద లఢక్ క్వెస్ట్ పేరుతో నిర్వహించిన బైక్ రైడ్లో బ్రాహ్మణి పాల్గొన్నారు. అయితే దీనికి సంబంధించి జావా యెడ్జీ మోటార్ సైకిల్స్ పేరుతో ఓ షార్ట్ ఫిల్మ్ను రూపొందించారు. పసుపు రంగులో ఉన్న స్పోర్ట్స్ బైక్పై బ్రాహ్మణి రయ్ రయ్ మంటూ దూసుకెళ్లారు. ప్రమాదకరమైన రోడ్ల మీద సునాయాసంగా ఆమె రైడింగ్ చేసి అబ్బురపరిచారు.
ఈ రైడ్ సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ అనుభావాలను పంచుకున్నారు. బ్రాహ్మణి మాట్లాడుతూ.. ఇప్పుడు ఉదయం 6:30 గంటలు అయింది. లఢక్ చాలా అద్భుతంగా, అందంగా ఉంది. థక్ సే ఆరామానికి మేం ఇప్పుడు బయల్దేరుతున్నాం. అసలైన ఆధ్యాత్మిక భావన కోసం ఎదురుచూస్తున్నాం. అక్కడ ధాన్యం చేస్తామని బ్రాహ్మణి పేర్కొన్నారు.