New Secretariat
విధాత, మెదక్ బ్యూరో: నూతన సచివాలయాన్ని సీఎం కెసిఆర్ ప్రారంభించిన అనంతరం మెదక్ ఉమ్మడి జిల్లా కు చెందిన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు తనకు కేటాయించిన నూతన ఛాంబర్ లో విధులు నిర్వహించారు.
సీతారామ ప్రాజెక్టు కు సంబంధించిన ఫైల్ పై మంత్రి హరీష్ రావు తొలి సంతకం చేశారు.. అంతకు ముందు మంత్రి ఛాంబర్ లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
నూతన ఛాంబర్ లో విధులు చేపట్టిన మంత్రికి ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యేలు పద్మా దేవేందర్ రెడ్డి, మదన్ రెడ్డి, చంటి క్రాంతి కిరణ్, మహిపాల్ రెడ్డి, భూపాల్ రెడ్డి, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ వాకిట సునీతా లక్ష్మారెడ్డి తదితరులు శుభాకాంక్షలు తెలిపారు.