‘బండి’ ప్రజాసంగ్రామ యాత్రకు అనుమతి నిరాకరణ

విధాత: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ చేపట్టనున్న 5వ విడత ప్రజాసంగ్రామ యాత్రకు పోలీసులు అనుమతి నిరాకరించారు. రేపు బైంసా నుంచి ప్రారంభం కావాల్సి ఉండగా యాత్రకు ఆదిలాబాద్‌ ఎంపీ సోయం బాపూరావు అనుమతి కోరిన సంగతి తెలిసిందే. బైంసాలో శాంతిభద్రతల కారణంగా పోలీసులు అనుమతి నిరాకరించారు. అనుమతి నిరాకరించినట్లు నిర్మల్‌ ఎస్పీ ప్రవీణ్‌కుమార్‌ ధృవీకరించారు. మరోవైపు రేపు బండి సంజయ్‌ యాత్రకు అనుమతి ఇవ్వాలని కోరుతూ..నిర్మల్‌ ఎస్పీ క్యాంపు కార్యాలయం ఎదుట బీజేపీ ఆందోళన […]

  • By: krs    latest    Nov 27, 2022 3:24 PM IST
‘బండి’ ప్రజాసంగ్రామ యాత్రకు అనుమతి నిరాకరణ

విధాత: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ చేపట్టనున్న 5వ విడత ప్రజాసంగ్రామ యాత్రకు పోలీసులు అనుమతి నిరాకరించారు. రేపు బైంసా నుంచి ప్రారంభం కావాల్సి ఉండగా యాత్రకు ఆదిలాబాద్‌ ఎంపీ సోయం బాపూరావు అనుమతి కోరిన సంగతి తెలిసిందే.

బైంసాలో శాంతిభద్రతల కారణంగా పోలీసులు అనుమతి నిరాకరించారు. అనుమతి నిరాకరించినట్లు నిర్మల్‌ ఎస్పీ ప్రవీణ్‌కుమార్‌ ధృవీకరించారు. మరోవైపు రేపు బండి సంజయ్‌ యాత్రకు అనుమతి ఇవ్వాలని కోరుతూ..నిర్మల్‌ ఎస్పీ క్యాంపు కార్యాలయం ఎదుట బీజేపీ ఆందోళన చేపట్టింది. ఆందోళ చేస్తున్నవారిని పోలీసులు అరెస్టు చేశారు.

బండి సంజయ్‌ను అడ్డుకున్న పోలీసులు
నిర్మల్ వెళుతున్న bjp రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్‌ను పోలీసులు అడ్డుకున్నారు. పాదయాత్రకు అనుమతి లేదంటూ జగిత్యాల దాటాక రోడ్డుకు అడ్డంగా వాహనాలను ఉంచి బండి సంజయ్ ను చుట్టుముట్టారు. ఈ సందర్భంగా పోలీసుల తీరుపై బీజేపీ కార్యకర్తలు మండిపడ్డారు.